Arvind Kejriwal: దొంగలు, అవినీతిపరులు అందరూ ఒకే పార్టీలో ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: సీబీఐ-ఈడీ దాడులు అవినీతిపరులందరినీ ఒకే రాజకీయ పార్టీలోకి తీసుకొచ్చాయని, కేంద్రంలో బీజేపీ పాలన ముగియగానే దేశం అవినీతి రహితంగా మారుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు. అవినీతిపరులందరినీ ఈడీ, సీబీఐ ఒకే వేదికపైకి తీసుకొచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు ముందు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. అవినీతిపరులు కలిసి ఒకే వేదికపై కాదు, ఒకే పార్టీలో ఉన్నారన్నారు. అసెంబ్లీలో తాను ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆప్ ఎమ్మెల్యేలను వేటాడటంలో విఫలమైనందున బీజేపీ తన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుందని, వారు ఎటువంటి ఒత్తిళ్లకు లొంగిపోరని అన్నారు.
బీజేపీకి పోరాడడం, దుర్భాషలాడడం మాత్రమే తెలుసునని ఆరోపించిన ఆయన.. 2025 అసెంబ్లీ ఎన్నికలను పక్కనబెడితే, 2050లో కూడా ఢిల్లీలో కాషాయ పార్టీ గెలుపొందదని పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటోందన్న కేజ్రీవాల్.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తొలగించే ఏ అవకాశాన్ని కాషాయ పార్టీ వదులుకోలేదని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ, ఈడీ దాడులతో ఆప్ ఎమ్మెల్యేలను బెదిరించారని, ఒక్కొక్కరికి రూ.25 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని.. అవేమీ పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయాయన్నారు. ఆప్ నేతలు ఎవరూ భయపడొద్దని, మీరు జైలుకు వెళ్లినా మీ కుటుంబాలను చూసుకుంటానని కేజ్రీవాల్ ఆప్ ఎమ్మెల్యేలతో అన్నారు. “దొంగలు, అవినీతిపరులు అందరూ ఒకే పార్టీలో ఉన్నారు.. బీజేపీ వాళ్లు ఒక్కసారి తమ పాలన ముగిసిన తర్వాత జైలులో ఉంటే దేశం అవినీతి రహితంగా మారుతుంది. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానికి అపారమైన అవకాశం లభించింది. దేశంలో భయం, దోపిడి వాతావరణం ఉంది” అని కేజ్రీవాల్ అన్నారు.
Also Read
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
Read Also: bomb blast case: రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులు విడుదల
నారాయణ్ రాణే, హిమంత బిస్వా శర్మ, సువేందు అధికారిని ఉదాహరణగా చూపుతూ, వారు అవినీతికి పాల్పడినందున వారు బీజేపీలో చేరారని ఆరోపించారు. 2017లో తన ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఆ తర్వాతి సంవత్సరాల్లో కూడా విజయం సాధించలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లను తుపాకీతో అరెస్టు చేసినట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మీకు కాస్త పరువు ఉంటే మా ఎమ్మెల్యేలపై ఆపరేషన్ కమలం ప్రయోగించకండి.. మేం భగత్ సింగ్ అనుచరులమని ఆయన అన్నారు.
అవిశ్వాస తీర్మానానికి బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలు అవసరమని, ఆప్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తెచ్చుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నారని, కానీ విఫలమయ్యారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామ్యానికి సానుకూల సందేశాన్ని అందిస్తున్నాయని ఆయన అన్నారు. బీజేపీ పాలిత కేంద్రం ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలను పని చేయడానికి అనుమతించడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. విశ్వాస తీర్మానంపై 65 నిమిషాల పాటు జరిగిన చర్చలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ ప్రతిపక్షాలకు 35 నిమిషాల సమయం ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు.ఎలాంటి ఆధారం లేకుండా అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన ప్రతికూల రాజకీయాలకు పాల్పడవద్దని ప్రతిపక్ష నేత రాంవీర్ సింగ్ బిధూరిని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం మాకు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశిస్తున్నామని, బీజేపీ ప్రతికూల రాజకీయాలకు పాల్పడదని భావిస్తున్నామని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!