Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Probe Agencies Have Brought All Corrupt People In One Party Says Arvind Kejriwal

Arvind Kejriwal: దొంగలు, అవినీతిపరులు అందరూ ఒకే పార్టీలో ఉన్నారు..

Published Date :March 30, 2023 , 8:08 am
By Mahesh Jakki
Arvind Kejriwal: దొంగలు, అవినీతిపరులు అందరూ ఒకే పార్టీలో ఉన్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Arvind Kejriwal: సీబీఐ-ఈడీ దాడులు అవినీతిపరులందరినీ ఒకే రాజకీయ పార్టీలోకి తీసుకొచ్చాయని, కేంద్రంలో బీజేపీ పాలన ముగియగానే దేశం అవినీతి రహితంగా మారుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు. అవినీతిపరులందరినీ ఈడీ, సీబీఐ ఒకే వేదికపైకి తీసుకొచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు ముందు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. అవినీతిపరులు కలిసి ఒకే వేదికపై కాదు, ఒకే పార్టీలో ఉన్నారన్నారు. అసెంబ్లీలో తాను ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆప్ ఎమ్మెల్యేలను వేటాడటంలో విఫలమైనందున బీజేపీ తన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుందని, వారు ఎటువంటి ఒత్తిళ్లకు లొంగిపోరని అన్నారు.

బీజేపీకి పోరాడడం, దుర్భాషలాడడం మాత్రమే తెలుసునని ఆరోపించిన ఆయన.. 2025 అసెంబ్లీ ఎన్నికలను పక్కనబెడితే, 2050లో కూడా ఢిల్లీలో కాషాయ పార్టీ గెలుపొందదని పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటోందన్న కేజ్రీవాల్‌.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తొలగించే ఏ అవకాశాన్ని కాషాయ పార్టీ వదులుకోలేదని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ, ఈడీ దాడులతో ఆప్‌ ఎమ్మెల్యేలను బెదిరించారని, ఒక్కొక్కరికి రూ.25 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని.. అవేమీ పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయాయన్నారు. ఆప్‌ నేతలు ఎవరూ భయపడొద్దని, మీరు జైలుకు వెళ్లినా మీ కుటుంబాలను చూసుకుంటానని కేజ్రీవాల్‌ ఆప్‌ ఎమ్మెల్యేలతో అన్నారు. “దొంగలు, అవినీతిపరులు అందరూ ఒకే పార్టీలో ఉన్నారు.. బీజేపీ వాళ్లు ఒక్కసారి తమ పాలన ముగిసిన తర్వాత జైలులో ఉంటే దేశం అవినీతి రహితంగా మారుతుంది. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానికి అపారమైన అవకాశం లభించింది. దేశంలో భయం, దోపిడి వాతావరణం ఉంది” అని కేజ్రీవాల్ అన్నారు.

Read Also: bomb blast case: రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులు విడుదల

నారాయణ్ రాణే, హిమంత బిస్వా శర్మ, సువేందు అధికారిని ఉదాహరణగా చూపుతూ, వారు అవినీతికి పాల్పడినందున వారు బీజేపీలో చేరారని ఆరోపించారు. 2017లో తన ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఆ తర్వాతి సంవత్సరాల్లో కూడా విజయం సాధించలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను తుపాకీతో అరెస్టు చేసినట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మీకు కాస్త పరువు ఉంటే మా ఎమ్మెల్యేలపై ఆపరేషన్ కమలం ప్రయోగించకండి.. మేం భగత్ సింగ్ అనుచరులమని ఆయన అన్నారు.

అవిశ్వాస తీర్మానానికి బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలు అవసరమని, ఆప్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తెచ్చుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నారని, కానీ విఫలమయ్యారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామ్యానికి సానుకూల సందేశాన్ని అందిస్తున్నాయని ఆయన అన్నారు. బీజేపీ పాలిత కేంద్రం ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలను పని చేయడానికి అనుమతించడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. విశ్వాస తీర్మానంపై 65 నిమిషాల పాటు జరిగిన చర్చలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ ప్రతిపక్షాలకు 35 నిమిషాల సమయం ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు.ఎలాంటి ఆధారం లేకుండా అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన ప్రతికూల రాజకీయాలకు పాల్పడవద్దని ప్రతిపక్ష నేత రాంవీర్ సింగ్ బిధూరిని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం మాకు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశిస్తున్నామని, బీజేపీ ప్రతికూల రాజకీయాలకు పాల్పడదని భావిస్తున్నామని ఆయన అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aam admi party
  • AAP
  • Arvind Kejriwal
  • bjp
  • CBI

తాజావార్తలు

  • PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..

  • Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్‌మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!

  • Arshdeep Singh Expensive Over: ఒకే ఓవర్‌లో 10 బంతులు, 24 రన్స్.. అర్ష్‌దీప్ సింగ్‌తో మాములుగా ఉండదు మరి!

  • US-Iran Talks: “అమెరికాను నమ్మలేం”.. చర్చల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

ట్రెండింగ్‌

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions