bomb blast case: రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాష్ట్ర రాజధానిని కుదిపేసిన 2008 నాటి జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురు దోషులను రాష్ట్ర హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. హైకోర్టులో 28 అప్పీళ్లను సమర్పించిన ఈ నలుగురు దోషులను న్యాయమూర్తులు పంకజ్ భండారీ, సమీర్ జైన్లతో కూడిన డివిజన్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మొత్తం కేసుపై 48 రోజుల పాటు విచారణ కొనసాగింది. విచారణ అధికారికి న్యాయపరమైన అవగాహన లేదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అందువల్ల దర్యాప్తు అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిపై విచారణ జరిపించాలని ప్రధాన కార్యదర్శిని కూడా కోర్టు కోరింది.
Also Read:SriRama Navami: తెలుగురాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
కోర్టు తీర్పు వెలువరిస్తూనే ఇన్వెస్టిగేషన్ అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈడీ కేసు దర్యాప్తు అధికారులుగా ఉన్న రాజేంద్ర సింగ్ నయన్, జై సింగ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మహేంద్ర చౌదరిలపై చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ డీజీపీని కోర్టు ఆదేశించింది. 10 పేజీల తీర్పులో, మొత్తం కేసుతో పోలీసుల సిద్ధాంతం సరిపోలడం లేదని కోర్టు పేర్కొంది.
నిందితుల తరఫు న్యాయవాది సయ్యద్ సాదత్ అలీ మాట్లాడుతూ.. ఏటీఎస్ సిద్ధాంతం మొత్తం తప్పు అని హైకోర్టు పేర్కొన్నదని, అందుకే నిందితులను నిర్దోషులుగా విడుదల చేశామని అన్నారు. నలుగురు నిందితులకు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించిందని తెలిపారు. “ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మేము హైకోర్టుకు వచ్చాము. నిందితుల్లో ఒకరు మైనర్. ఘటన జరిగినప్పుడు అతడి వయసు 16 ఏళ్లని కోర్టు అంగీకరించింది. నిందితులపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ATS, ప్రాసిక్యూషన్ ఆరోపణలను రుజువు చేయలేకపోయాయి. బాంబులు అమర్చినట్లు రుజువు కాలేదు, నిందితులు సైకిల్ కొన్నట్లు రుజువు కాలేదు అని చెప్పారు.
Also Read:Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సీఎం కావాలి..
మే 13, 2008న జైపూర్ లో 8 చోట్ల వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో 71 మంది మృతి చెందగా, 185 మంది గాయపడ్డారు. మహ్మద్ సైఫ్, సైఫుర్ రెహమాన్, సర్వర్ అజ్మీ, మహ్మద్ సల్మాన్లను హత్య, విద్రోహం, పేలుడు పదార్థాల చట్టంలో దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం 13 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ముగ్గురు నిందితులు ఇంకా పరారీలో ఉండగా, ఇద్దరు హైదరాబాద్, ఢిల్లీ జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలోని బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో మిగిలిన ఇద్దరు నేరస్థులు హతమయ్యారు. నలుగురు నిందితులను జైపూర్ జైలులో ఉంచారు. దిగువ కోర్టు నిందితులకు మరణశిక్ష విధించింది.
Also Read:Pak Twitter Account: పాక్కు షాక్.. భారత్లో అధికారిక ట్విట్టర్ ఖాతా బ్లాక్
కాగా, ఈ కేసు నిందితుల విడుదలై బిజెపి రాష్ట్ర మాజీ చీఫ్ సతీష్ పూనియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద నేరంలో దోషులుగా తేలిన నలుగురిని హైకోర్టు విడుదల చేయడం రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ న్యాయవాదంపై సందేహాలను లేవనెత్తుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఏటీఎస్ సాక్ష్యాధారాలు సమర్పించిన తీరు, ఆ తర్వాత దాన్ని క్లిప్ చేసి ఎడిట్ చేసి, ప్రాసిక్యూషన్ సరిగా జరగలేదన్నారు. సాక్ష్యం సరిగా రాలేదని కోర్టు చెప్పిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయరి తెలిపారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..