Ajeya Kallam: ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అక్కర్లేని రాద్ధాంతం జరుగుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajeya Kallam: ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అక్కర్లేని రాద్ధాంతం జరుగుతోందని సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లాం చెప్పారు. ఈ చట్టం అమల్లోకి రావడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం పడుతుందన్నారు. కోర్టు అనుమతి తర్వాతే చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అర్బన్, రూరల్ ప్రాంతాలను సర్వే చేస్తున్నామని.. గ్రామ, కంఠాల సర్వేనూ చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకూ 6వేల గ్రామాల్లో సర్వే పూర్తైందని.. 11 వేల గ్రామాల్లో ఇంకా సర్వే పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ సర్వే పూర్తైతే భూ వివాదాలు తగ్గిపోతాయని.. ఇప్పటి వరకు దేశంలో భూములకు టైటిల్ అనేదే లేదన్నారు. ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్లు ఆధారాలే తప్ప.. యాజమాన్యపు హక్కులు కావన్నారు.
Read ALso: Botsa Satyanarayana: ల్యాండ్ టైటిలింగ్ అమలు చేస్తే భూములు ఈజీగా అమ్ముకోవచ్చు..
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ యాజమాన్య హక్కులు సంక్రమిస్తాయని.. ఇది ఇష్టం లేని కొందరు అడ్వొకేట్లు లేని వివాదాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల్లో డ్రోన్ సర్వే చేపట్టారు.. ఫీల్డ్ సర్వే చేపట్టాల్సి ఉందన్నారు. రూరల్ ప్రాంతాల్లో 6 వేల గ్రామాల్లో ఫీల్డ్ సర్వే పూర్తి అయిందన్నారు. ఆరు వేలకు పైగా గ్రామాల్లో సర్వే చేపడితే.. కేవలం రెండు శాతం మాత్రమే వివాదం వచ్చిందన్నారు. సర్వే పూర్తైతే ప్రస్తుతమున్న పాస్ పుస్తకాలకంటే.. రెండింతలు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ తరహా విధానం తేవాలని చాలా మంది ఐఏఎస్లు కలలు కంటారన్నారు. టైటిల్ ఇచ్చాక కూడా అభ్యంతరాలకు రెండేళ్ల పాటు గడువు ఉందన్నారు.రెండేళ్ల తర్వాత కూడా ఏమైనా వివాదాలు వచ్చి కోర్టులకెళ్తే.. ప్రభుత్వమే మొదటి రెస్పాడెంటుగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన టైటిలింగ్ ఏమైనా తేడాలున్నాయని నిరూపితమైతే.. ప్రభుత్వమే కాంపన్సేషన్ చెల్లిస్తుందన్నారు. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో డ్రాప్ట్ పూర్తైందని సీఎం ప్రధాన సలహాదారు అజేయకల్లాం వివరించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
-
Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
-
Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?