PM Modi: హ్యాట్రిక్ విజయం ఖాయం.. లోక్ సభలో ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. విపక్షాల తీర్మానాన్ని నేను అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలు చాలాకాలం పాటు విపక్షంలోనే ఉండాలనే సంకల్పం తీసుకున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు. మరోవైపు… ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
Lok sabha: సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోడీ లాస్ట్ స్పీచ్
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని మోడీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి కోసమే ప్రతి పక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ వైఖరి వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టమని ప్రధాని తెలిపారు. ఒకే ప్రొడక్టును కాంగ్రెస్ పదే పదే రీలాంచ్ చేస్తోంది.. కాంగ్రెస్ దుకాణం ఒక్క నాయకుడి కోసమేనని విమర్శించారు. వాళ్ల దుకాణాలు త్వరలోనే మూతపడతాయని.. కాంగ్రెస్ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోందని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ నత్తనడకతో ఎవరూ పోటీ పడలేరంటూ సెటైర్లు వేశారు.
Jharkhand: రాహుల్తో కల్పనా సోరెన్ భేటీ.. ఏం చర్చించారంటే..!
మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ప్రధాని మోడీ తెలిపారు. ఎవ్వరేమనుకున్నా తమకు హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. బీజేపీకి సొంతంగా 370కి పైగా సీట్లు వస్తాయన్నారు. ఎన్డీయేకు వందకు పైగా సీట్లు వస్తాయని మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది.. ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానానికి చేరిందని తెలిపారు. మూడో టర్మ్ లో ప్రపంచలోనే మూడో ఆర్ధిక శక్తిగా భారత్ ఎదుగబోతుందని పేర్కొన్నారు. మూడో టర్మ్ లో వెయ్యేళ్ల అభివృద్ధికి సరిపడా పునాదులు వేస్తామని.. దేశ ప్రజలు తమ పాలనను వెయ్యేళ్లు గుర్తుంచుకుంటారని ప్రధాని మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!