Kejriwal: గత తొమ్మిదేళ్లుగా మౌనంగానే ఉన్నారు.. ప్రధానిపై కేజ్రీవాల్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చైనా అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. గత 9 ఏళ్లుగా చైనా భారత్పై కన్నేసిందని.. అయితే ప్రధాని పూర్తిగా మౌనంగా ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా ఆయన నోటి నుంచి చైనా అనే పదం కూడా రాదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “చైనా అధ్యక్షుడు 2019 అక్టోబర్లో భారతదేశానికి వచ్చినట్లు తనకు గుర్తుందని.. తమిళనాడులోని మహాబలేశ్వర్లో, మోడీ.. జిన్పింగ్ చేయి చేయి కలిపి నడవడం చూశామన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. అయితే 2020 జూన్ 15న గాల్వన్ లోయలో చైనా సైన్యం మన సైనికులపై దాడి చేసి 20 మంది సైనికులను హతమార్చిందని కేజ్రీవాల్ గుర్తుచేశారు.
Jailer: వర్మ ప్లే లిస్ట్ లో డ్యాన్స్ చేసిన వ్యక్తి చనిపోయాడని మీకు తెలుసా.. ?
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీని ఉద్దేశించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. గత 9 ఏళ్లలో ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మౌనంగానే ఉన్నారని విమర్శించారు. మణిపూర్లో 6500 కేసులు నమోదయ్యాయని, వేలాది మంది ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చిందని, 150 మంది మరణించారని.. సైన్యం, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మణిపూర్ అల్లర్ల ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. మణిపూర్ కాలి పోతుంటే ప్రధాని మోడీ, బీజేపీ శ్రేణులు ఎలా మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రధాని ఈశాన్య ప్రాంతాలకు చాలాసార్లు వెళ్లినట్లు బీజేపీ వాళ్లు చెబుతున్నారని, ఇప్పుడు ఎందుకు వెళ్లలేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తండ్రి లాంటి ప్రధాని మణిపూర్ కూతుళ్లకు వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు.
Bandaru Vijayalakshmi: పార్టీల చూపు బండారు విజయలక్ష్మి వైపు ..!?
మరోవైపు కొన్ని రోజుల క్రితం జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు కూర్చుని న్యాయం కోసం ధర్నా చేశారని అన్నారు. వాళ్లు పతకాలు గెలిచి వచ్చిన తర్వాత వారితో వారి ఫోటోలు తీసుకుంటారు. కానీ వారికి న్యాయం ఎందుకు జరగలేదు.. వారు సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లా్ల్సి వచ్చిందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని నెహ్రూను బీజేపీ శాపనార్థాలు పెడుతుందని కేజ్రీవాల్ ఆరోపించారు.
- Tags
- AAP
- bjp
- kejriwal
- modi
- prime minister
తాజావార్తలు
-
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
-
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!