Monsoon: సమయం కంటే ముందే దేశంలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయాని కంటే ముందే అండమాన్ – నికోబార్ను తాకబోతున్నాయి. రుతుపవనాలు మే 19 న అండమాన్ నికోబార్కు చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల వైపు కదులుతాయి. ప్రతి సంవత్సరం రుతుపవనాలు మే 22 నాటికి వస్తాయి. కాని ఈ సారి మూడు రోజుల ముందుగానే రావచ్చని తెలిపారు. అదే సమయంలో, లా నినాతో పాటు, హిందూ మహాసముద్ర ద్విధ్రువ (IOD) పరిస్థితులు కూడా ఈ ఏడాది రుతుపవనాలకు అనుకూలంగా మారుతున్నాయి.
READ MORE: AP CEO MK Meena: పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది..
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
ఈ నెల ప్రారంభంలో కూడా, మే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని IMD అంచనా వేసింది. మరో రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాల రాకతో ఈ ఏడాది భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రుతుపవనాలు జూన్ 10 నాటికి మహారాష్ట్రకు చేరుకుంటాయి. జూన్ 15కు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లకు ప్రవేశిస్తాయి. కాగా, జూన్ 20న, ఇది గుజరాత్లోని అంతర్గత ప్రాంతాలు, ఎంపీ, ఉత్తర్ ప్రదేశ్ మధ్య ప్రాంతాలను తాకే అవకాశం ఉంది. ఈ కార్యకలాపాలపై వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇది కాకుండా, జూన్ 25 నాటికి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కశ్మీర్కు చేరుకుంటాయి. జూన్ 30 న అది రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్లకు చేరుతాయి. జూలై 8 నాటికి రుతుపవనాలు మొత్తం దేశాన్ని కవర్ చేస్తాయి.
- Tags
- bihar
- Chhattisgarh
- good news
- Gujarat
- IMD
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!