Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు మొత్తం 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు అధికార ఎన్డీఏ ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదింపజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీయడానికి వ్యూహరచన చేసింది. దీంతో ఉభయసభల్లో తీవ్ర వాగ్వాదాలు, నిరసనలు, గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
సమావేశాల ప్రారంభానికి ముందు ఈ రోజు ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనంలో ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహం, సమన్వయం, ప్రభుత్వంపై చేపట్టాల్సిన ఉమ్మడి పోరాట కార్యాచరణను ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లు ఖరారు చేయనున్నారు. అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారం, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలు వంటి అంశాలను సభలో బలంగా ప్రస్తావించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
ఇటీవల పలు రాజకీయ పార్టీల్లో చోటుచేసుకున్న పరిణామాలు కూడా ఈ సమావేశాల్లో ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు ఎంపీలు కొత్త పార్టీలో చేరడం, కొందరు బీజేపీలోకి వెళ్లడం, అలాగే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరడం వంటి పరిణామాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ ప్రతిపక్ష పార్టీల్లో చీలికలను అధికార పార్టీ ప్రోత్సహిస్తోందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. మంగళవారం ఉదయం పార్లమెంట్లో జరిగే ఎన్డీఏ “మంగళ్-మిలన్” సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీలకు ప్రభుత్వ అజెండా, లక్ష్యాలను వివరించనున్నారు. ఈ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక చట్టాలను ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
December Clash : డిసెంబర్ రేస్లో రెబల్ స్టార్ vs కింగ్ ఖాన్
-
FIFA World Cup 2026 Awards List: ఫిఫా వరల్డ్ కప్ అవార్డుల జాబితా.. అన్ని ప్రధాన వ్యక్తిగత అవార్డులు స్పెయిన్కే
-
Hi Movie OTT: నయనతార ‘హాయ్’ మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!