Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
- గోధుమపిండి, బెల్లంతో ఆరోగ్యకరమైన మాల్పువా
- పిండిని ఎలా సిద్ధం చేసుకోవాలి?
- వేయించి పాకంలో నానబెట్టే సరైన విధానం
- నైవేద్యానికి ఎందుకు ప్రత్యేకం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagannath Prasadam Recipe: పూరీ జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పించే ప్రసిద్ధ మాల్పువాను గోధుమపిండి, బెల్లంతో ఇంట్లోనే సులభంగా, రుచికరంగా తయారు చేసుకునే విధానం తెలుసుకోండి. భారతీయ సాంప్రదాయ వంటకాల్లో ‘మాల్పువా’కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగలు, శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో ఈ రుచికరమైన తీపి వంటకాన్ని ఎక్కువగా తయారు చేస్తుంటారు. సాధారణంగా మైదా, పంచదారతో చేసే మాల్పువాల కంటే.. గోధుమపిండి, బెల్లం , సాత్విక మసాలాలు (యాలకులు, సోంపు వంటివి) ఉపయోగించి చేసే మాల్పువాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రోజు మనం ఇంట్లోనే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మాల్పువాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో చూద్దాం.
కావల్సిన పదార్థాలు:
- గోధుమ పిండి – 1.5 నుండి 2 కప్పులు
- బెల్లం – 1 కప్పు
- పాలు – 2 టీస్పూన్లు
- కుంకుమపువ్వు కాడలు – 4 నుండి 5
- పచ్చ కర్పూరం (తినదగిన కర్పూరం) – చిటికెడు
- పెద్ద యాలకుల కాయలు – 2 లేదా 3
- సోంపు గింజలు – 1 టేబుల్ స్పూన్
- నల్ల మిరియాలు – 8 నుండి 10
- నీరు – అవసరమైనంత
- నెయ్యి లేదా నూనె – వేయించడానికి సరిపడా
పిండిని సిద్ధం చేసుకునే విధానం:
ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీరు తీసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఆ తర్వాత పెద్ద యాలకులు, సోంపు గింజలు, నల్ల మిరియాలను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు కరిగించిన బెల్లం నీటిని వడకట్టి, అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కలపాలి. ఆ బెల్లం నీళ్లలో గోధుమ పిండిని కొద్దికొద్దిగా వేస్తూ, ఎక్కడా ఉండలు కట్టకుండా మెత్తని పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా పిసికితే మాల్పువాలు అంత సాఫ్ట్గా వస్తాయి.
Also Read
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
- Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
ఆ తర్వాత ఈ మిశ్రమంలో మనం ముందుగా దంచి పెట్టుకున్న పొడి మసాలాలు, రెండు స్పూన్ల పాలు , కుంకుమపువ్వు నానబెట్టిన నీటిని వేసి బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీరు పోస్తూ.. పిండి మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా దోసెల పిండిలా (జారుడుగా) సిద్ధం చేసుకోవాలి.
మాల్పువాలను వేయించడం, నానబెట్టడం
ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి వేయించడానికి సరిపడా నెయ్యి లేదా నూనెను వేడి చేయాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత, ఒక చిన్న గరిటెడు పిండిని తీసుకుని బాణలి మధ్యలో పోయాలి (దోసెలా రుద్దకూడదు, కేవలం ఒకేచోట పోయాలి). మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి, మాల్పువా రెండు వైపులా మంచి బంగారు గోధుమ రంగు (Golden Brown) లోకి మారే వరకు వేయించాలి. వేగిన మాల్పువాను బయటకు తీసి, గరిటెతో ఒత్తుతూ అదనంగా ఉన్న నెయ్యి లేదా నూనెను పూర్తిగా పిండేయాలి. ఇలా చేసిన తర్వాత, వేడివేడి మాల్పువాలను గోరువెచ్చగా ఉన్న బెల్లం ద్రావణంలో (పాకంలో) వేసి 2-3 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని, పైన బాదం లేదా పిస్తా పప్పుల ముక్కలతో అలంకరిస్తే నోరూరించే మాల్పువాలు రెడీ..
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఆరోగ్య పరంగా చూసుకుంటే, తెల్ల చక్కెర (పంచదార) కంటే బెల్లం వంటి సహజమైన, శుద్ధి చేయని తీపి పదార్థాలను ఉపయోగించడం చాలా మంచిది. ‘రీసెర్చ్గేట్.నెట్’ (ResearchGate.net) లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. మాల్పువా తయారీలో మైదా, చక్కెరలకు బదులుగా గోధుమపిండి, బెల్లం వంటి సహజ వనరులను వాడటం వల్ల ఆహార పోషక విలువలు పెరుగుతాయని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. అంతేకాదు, శాస్త్రీయ , జాతి వృక్షశాస్త్ర పరిశోధనల ప్రకారం.. బార్లీ లేదా మిల్లెట్స్ (చిరుధాన్యాలు) వంటి పురాతన ధాన్యాలతో వీటిని తయారు చేసి నెయ్యిలో వేయించడం వల్ల, ఇవి శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలను (Micronutrients), దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా కాలానుగుణంగా వచ్చే మార్పులను తట్టుకోవడానికి, పండుగ సమయాల్లో ఇవి శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి.
దేవునికి నైవేద్యంగా సమర్పించే విధానం..
తయారైన వేడివేడి మాల్పువాలను ఒక అరటి ఆకుపై అందంగా అమర్చాలి. అరటి ఆకుపై వేడి పదార్థాలు వడ్డించడం వల్ల ఆకులోని సహజ పోషకాలు, ఔషధ గుణాలు ఆహారానికి అందుతాయి, అలాగే మాల్పువాల తీపి సువాసన మరింత పెరుగుతుంది. ఈ మాల్పువాలపై ఒక పవిత్రమైన తులసి ఆకును ఉంచి, జగన్నాథ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తే పూజ సంపూర్ణమవుతుంది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!