Ponnam Prabhakar : దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జన జాతర సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకే అనేక సందర్భాల్లో రాజకీయ సలహాలతొ పాటు ప్రజా సమస్యల పై పోరాట మార్గాన్ని ఇచ్చిన పెద్దలు జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించండన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. 30 సంవత్సరాల తరువాత బీజేపీ ఎవరి సహకారం లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలొకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాని 10 సంవత్సరల్లో దేశ ఆస్తులను సంపదను అదానీ, అంబానీలకు అప్పగించాడని ఆయన మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఏక్ బార్ చార్ సౌ బార్ అంటున్నారని, 400 అనగానే చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఆలోచిస్తున్నారన్నారు.
అంతేకాకుండా.. ‘ఇప్పటికే ఇంత మంచి మెజారిటీ వచ్చిన 400 ఎందుకు అని అడుగుతున్నారు.. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి ,ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టి ఏకచక్రధిపత్యం చేయాలని చూస్తున్నారు.. దేశంలో ఎస్సి, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తొలగించాలనే కుట్ర చేస్తున్నారు నరేంద్ర మోడీ.. అందుకే బీజేపీ అభ్యర్థి అరవింద్ ని ఓడించాలి ,గుణపాఠం చెప్పాలి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లు లేని భారత దేశాన్ని చూడాలి అన్నాడు.. ఆనాడు మండల్ కమిషన్ తెస్తే కమండల్ పేరుతొ రిజర్వేషన్ల ప్రక్రియ ఆపారు.. మొన్న రాహుల్ గాంధీ గారు కుల గణన సర్వే అంటే ఆపడానికి సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరుపున అఫిడవిట్ వేశారు.. ముందస్తుగా అప్రమత్తంగా లేకుంటే మనకు రాజ్యాంగం ఇచ్చిన ఎస్సి, ఎస్టీ, బీసీ ల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది..
Also Read
- Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
- IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
- Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
రిజర్వేషన్లు ఉండాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.. తెలంగాణ నుండి ఒక్క బీజేపీ సీటు గెలిచిన అది సమాజం లో ప్రజాస్వామ్యంకే ప్రమాదం.. అందరూ ఆలోచించండి.. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కుల గణన సర్వే చేస్తుంది.. అనేక బలహీన వర్గాల అభివృద్ధికి కార్పొరేషన్ లను ఏర్పాటు చేసింది. వాళ్ళ అభ్యున్నత్తికి ప్రభుత్వం కృషి చేస్తుంది.. కాంగ్రెస్ కావాలా లేక నియంతల కింద ఫ్యూడలిస్ట్ ల కింద పనిచేద్దామా.. ఒకసారి ఆలోచించండి. జీవన్ రెడ్డి గారిని వారి అనుభవం రీత్యా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించండి..’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!