Ponnam Prabhakar : దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది..
జగిత్యాల జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జన జాతర సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకే అనేక సందర్భాల్లో రాజకీయ సలహాలతొ పాటు ప్రజా సమస్యల పై పోరాట మార్గాన్ని ఇచ్చిన పెద్దలు జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించండన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. 30 సంవత్సరాల తరువాత బీజేపీ ఎవరి సహకారం లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలొకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాని 10 సంవత్సరల్లో దేశ ఆస్తులను సంపదను అదానీ, అంబానీలకు అప్పగించాడని ఆయన మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఏక్ బార్ చార్ సౌ బార్ అంటున్నారని, 400 అనగానే చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఆలోచిస్తున్నారన్నారు.
అంతేకాకుండా.. ‘ఇప్పటికే ఇంత మంచి మెజారిటీ వచ్చిన 400 ఎందుకు అని అడుగుతున్నారు.. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి ,ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టి ఏకచక్రధిపత్యం చేయాలని చూస్తున్నారు.. దేశంలో ఎస్సి, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తొలగించాలనే కుట్ర చేస్తున్నారు నరేంద్ర మోడీ.. అందుకే బీజేపీ అభ్యర్థి అరవింద్ ని ఓడించాలి ,గుణపాఠం చెప్పాలి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లు లేని భారత దేశాన్ని చూడాలి అన్నాడు.. ఆనాడు మండల్ కమిషన్ తెస్తే కమండల్ పేరుతొ రిజర్వేషన్ల ప్రక్రియ ఆపారు.. మొన్న రాహుల్ గాంధీ గారు కుల గణన సర్వే అంటే ఆపడానికి సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరుపున అఫిడవిట్ వేశారు.. ముందస్తుగా అప్రమత్తంగా లేకుంటే మనకు రాజ్యాంగం ఇచ్చిన ఎస్సి, ఎస్టీ, బీసీ ల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది..
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
రిజర్వేషన్లు ఉండాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.. తెలంగాణ నుండి ఒక్క బీజేపీ సీటు గెలిచిన అది సమాజం లో ప్రజాస్వామ్యంకే ప్రమాదం.. అందరూ ఆలోచించండి.. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కుల గణన సర్వే చేస్తుంది.. అనేక బలహీన వర్గాల అభివృద్ధికి కార్పొరేషన్ లను ఏర్పాటు చేసింది. వాళ్ళ అభ్యున్నత్తికి ప్రభుత్వం కృషి చేస్తుంది.. కాంగ్రెస్ కావాలా లేక నియంతల కింద ఫ్యూడలిస్ట్ ల కింద పనిచేద్దామా.. ఒకసారి ఆలోచించండి. జీవన్ రెడ్డి గారిని వారి అనుభవం రీత్యా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించండి..’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!