Ponguleti Srinivas Reddy : ముగిసిన కేబినెట్ సమావేశం.. నిర్ణయాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని క్యాబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ స్పీచ్ ను కేబినెట్ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అభయ హస్తం ఆరు గ్యారెంటీల్లో అమల్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన 36 గంటల్లో రెండు పథకాలు అమలు చేసామని, 14 కోట్ల 25 లక్షల మంది జీరో టిక్కెట్ తో మహిళలు బస్సుల్లో ప్రయాణించారన్నారు. హామీ ఇచ్చారు. అవాకులు చెవాకులు పేల్చారో వారి నోటికి ప్లాస్టర్ వేసేలా మరో రెండు పథకాలను అమలు చేస్తామన్నారు. కుల గణనకు ఆమోదం తెలిపామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గేయంగా రాష్ట్ర గేయంగా మార్చుతూ ఆమోదం పొందినట్లు ఆయన తెలిపారు. రాచరిక పాలన గుర్తులను చేరిపి వేస్తూ తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నంకు ఆమోదించినట్లు, కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ఆమోదం, టీఎస్ నుంచి టీజీగా మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు 8వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత బీఏసీలో నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.
అంతేకాకుండా..’తొలి రోజున ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరో రెండు గ్యారంటీల హామీల అమలుపై కేబినెట్ చర్చించింది. రాచరికపు పునాదుల నుంచి త్యాగానికి పోరాటాలకు ప్రతిరూపంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ జీవన విధానాన్ని, కళారూపాలను పునరుజ్జీవింపజేయాలని, తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పునర్నిర్వచించుకోవాలని కేబినేట్ తీర్మానం చేసింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చాలని తీర్మానించారు. రాజరిక పాలన గుర్తులు లేకుండా మన ప్రాంతం, ప్రజలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని పోరాటాలకు, త్యాగాల చిహ్నంగా రూపుదిద్దాలని నిర్ణయం జరిగింది. దీని కోసం కళాకారుల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లలో తెలంగాణ పేరును సూచించే ‘టీఎస్’ అక్షరాలను ఇకపై ‘టీజీ’గా మార్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ల చట్టంలో అందుకు అవసరమైన సవరణలు చేయాలని తీర్మానించింది. హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఖైదీలకు క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై కేబినేట్లో చర్చ జరిగింది. క్షమాభిక్షపై ఖైదీల విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కొడంగల్ ఏరియా డెవెలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని (65) ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను నిర్వహిస్తారు.’ అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!