Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ponguleti About Cabinet Meeting

Ponguleti Srinivas Reddy : ముగిసిన కేబినెట్‌ సమావేశం.. నిర్ణయాలు ఇవే..

Published Date :February 4, 2024 , 10:01 pm
By Gogikar Sai Krishna
Ponguleti Srinivas Reddy : ముగిసిన కేబినెట్‌ సమావేశం.. నిర్ణయాలు ఇవే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని క్యాబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ స్పీచ్ ను కేబినెట్‌ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అభయ హస్తం ఆరు గ్యారెంటీల్లో అమల్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన 36 గంటల్లో రెండు పథకాలు అమలు చేసామని, 14 కోట్ల 25 లక్షల మంది జీరో టిక్కెట్ తో మహిళలు బస్సుల్లో ప్రయాణించారన్నారు. హామీ ఇచ్చారు. అవాకులు చెవాకులు పేల్చారో వారి నోటికి ప్లాస్టర్ వేసేలా మరో రెండు పథకాలను అమలు చేస్తామన్నారు. కుల గణనకు ఆమోదం తెలిపామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గేయంగా రాష్ట్ర గేయంగా మార్చుతూ ఆమోదం పొందినట్లు ఆయన తెలిపారు. రాచరిక పాలన గుర్తులను చేరిపి వేస్తూ తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నంకు ఆమోదించినట్లు, కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ఆమోదం, టీఎస్ నుంచి టీజీగా మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు 8వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత బీఏసీలో నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.

అంతేకాకుండా..’తొలి రోజున ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరో రెండు గ్యారంటీల హామీల అమలుపై కేబినెట్‌ చర్చించింది. రాచరికపు పునాదుల నుంచి త్యాగానికి పోరాటాలకు ప్రతిరూపంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ జీవన విధానాన్ని, కళారూపాలను పునరుజ్జీవింపజేయాలని, తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పునర్నిర్వచించుకోవాలని కేబినేట్ తీర్మానం చేసింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చాలని తీర్మానించారు. రాజరిక పాలన గుర్తులు లేకుండా మన ప్రాంతం, ప్రజలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని పోరాటాలకు, త్యాగాల చిహ్నంగా రూపుదిద్దాలని నిర్ణయం జరిగింది. దీని కోసం కళాకారుల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లలో తెలంగాణ పేరును సూచించే ‘టీఎస్’ అక్షరాలను ఇకపై ‘టీజీ’గా మార్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ల చట్టంలో అందుకు అవసరమైన సవరణలు చేయాలని తీర్మానించింది. హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఖైదీలకు క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై కేబినేట్లో చర్చ జరిగింది. క్షమాభిక్షపై ఖైదీల విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కొడంగల్ ఏరియా డెవెలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని (65) ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను నిర్వహిస్తారు.’ అని వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • cabinet meeting
  • CM Revanth Reddy
  • latest news
  • Ponguleti Srinivas Reddy

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం!

  • Iran Attacks on Dubai: ఇరాన్ ప్రతీకార దాడులు.. దుబాయ్ ఎందుకు టార్గెట్?

  • Pakistan Trolls: మార్పు అవసరమా?.. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాకిస్థాన్ ఓటములు!

  • #Suriya46 : సూర్య 46 టైటిల్ హంగామా షురూ.. ఫస్ట్ లుక్ రివీల్ కి టైమ్ టూ డేట్ ఫిక్స్

  • Operation Kill Khamenei: 15 నిమిషాల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం! వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో సంచలన నిజాలు..

  • Trisha: నచ్చినవాడు దొరికితేనే పెళ్లి.. లేదంటే ఒంటరిగానే!

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions