Khalistan : ముస్లింలను రెచ్చగొడుతున్న పన్ను.. అయోధ్యలో రచ్చ సృష్టించాలని ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan : ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఇప్పుడు భారతదేశంలోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా వీడియోలో అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా హింసకు పాల్పడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తాజా పరిణామాలతో భద్రతా సంస్థలు అప్రమత్తమైనట్లు చెబుతున్నారు. డిసెంబర్ 30న అయోధ్యలో జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. డిసెంబర్ 30 న అయోధ్యలో జరగనున్న రోడ్ షోను లక్ష్యంగా చేసుకోవాలని పన్ను ‘యుపి ముస్లింలను’ కోరాడు. ఇది మాత్రమే కాకుండా ముస్లింల కోసం కొత్త దేశం ‘ఉర్దుస్తాన్’ని సృష్టించాలని కోరాడు. త్వరలో భారతదేశంలో నమాజ్ను కూడా నిషేధిస్తారని ఆరోపించారు. విశేషమేమిటంటే అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో పన్ను ఇలాంటి ప్రకటన చేయడం విశేషం.
Read Also:Vishnu Stotram: ఈ స్తోత్రాలు వింటే మీకు అన్నింట్లో ధన లాభం కలుగుతుంది
Also Read
- Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఇందుకు సంబంధించి అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలతోనూ ఇన్పుట్లను పంచుకునేందుకు భారత్ సిద్ధమవుతోందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి భారత ప్రభుత్వం అధికారికంగా ఏమీ చెప్పలేదు. 2020లో భారత్ పన్నూను ఉగ్రవాది జాబితాలో చేర్చింది. ఇంతకు ముందు కూడా, అతను భారతదేశంలో అనేకసార్లు దాడి చేస్తానని లేదా అల్లకల్లోలం సృష్టిస్తానని బెదిరించాడు. గత వారం కూడా, పన్ను తనను కాశ్మీర్-ఖలిస్తాన్ రెఫరెండమ్ ఫ్రంట్ ప్రతినిధిగా అభివర్ణించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీ సైనికులపై దాడికి కూడా ఆయన మద్దతు తెలిపారు. ఈ దాడి ‘కాశ్మీరీలపై భారతదేశం చేస్తున్న హింసాకాండ ఫలితం’ అని అన్నారు. కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతంగా పన్నూ అభివర్ణించారు. పరిష్కారానికి రెఫరెండం మాత్రమే మార్గమని చెప్పారు.
Read Also:Ayyappa Pooja: మండలపూజ వేళ ఈ స్తోత్రపారాయణం చేస్తే పట్టిందల్లా బంగారమే అవుతుంది
ప్రధాని మోడీ అయోధ్య పర్యటన
ప్రధాని మోడీ శనివారం అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. దీనితో పాటు మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య విమానాశ్రయం, అయోధ్య రైల్వే స్టేషన్ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఎన్హెచ్-27, ధరమ్ పాత్, లతా మంగేష్కర్ చౌక్, రామ్ పథ్, తేదీ బజార్ మీదుగా అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ప్రధాని మోడీ రోడ్ షో దాదాపు 15 కి.మీ పొడవునా ఉంటుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Paraak Movie: KGFతర్వాత మరో సంచలనం..! ‘పరాక్’ టీజర్తో పాన్ ఇండియా హైప్.. శ్రీమురళి యాక్షన్కు ఫ్యాన్స్ ఫిదా
-
Ananya Pande : అనన్య పాండే నడుము గగిల్లిన గుప్తా
-
Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!