Khalistan : ముస్లింలను రెచ్చగొడుతున్న పన్ను.. అయోధ్యలో రచ్చ సృష్టించాలని ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan : ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఇప్పుడు భారతదేశంలోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా వీడియోలో అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా హింసకు పాల్పడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తాజా పరిణామాలతో భద్రతా సంస్థలు అప్రమత్తమైనట్లు చెబుతున్నారు. డిసెంబర్ 30న అయోధ్యలో జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. డిసెంబర్ 30 న అయోధ్యలో జరగనున్న రోడ్ షోను లక్ష్యంగా చేసుకోవాలని పన్ను ‘యుపి ముస్లింలను’ కోరాడు. ఇది మాత్రమే కాకుండా ముస్లింల కోసం కొత్త దేశం ‘ఉర్దుస్తాన్’ని సృష్టించాలని కోరాడు. త్వరలో భారతదేశంలో నమాజ్ను కూడా నిషేధిస్తారని ఆరోపించారు. విశేషమేమిటంటే అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో పన్ను ఇలాంటి ప్రకటన చేయడం విశేషం.
Read Also:Vishnu Stotram: ఈ స్తోత్రాలు వింటే మీకు అన్నింట్లో ధన లాభం కలుగుతుంది
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ఇందుకు సంబంధించి అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలతోనూ ఇన్పుట్లను పంచుకునేందుకు భారత్ సిద్ధమవుతోందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి భారత ప్రభుత్వం అధికారికంగా ఏమీ చెప్పలేదు. 2020లో భారత్ పన్నూను ఉగ్రవాది జాబితాలో చేర్చింది. ఇంతకు ముందు కూడా, అతను భారతదేశంలో అనేకసార్లు దాడి చేస్తానని లేదా అల్లకల్లోలం సృష్టిస్తానని బెదిరించాడు. గత వారం కూడా, పన్ను తనను కాశ్మీర్-ఖలిస్తాన్ రెఫరెండమ్ ఫ్రంట్ ప్రతినిధిగా అభివర్ణించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీ సైనికులపై దాడికి కూడా ఆయన మద్దతు తెలిపారు. ఈ దాడి ‘కాశ్మీరీలపై భారతదేశం చేస్తున్న హింసాకాండ ఫలితం’ అని అన్నారు. కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతంగా పన్నూ అభివర్ణించారు. పరిష్కారానికి రెఫరెండం మాత్రమే మార్గమని చెప్పారు.
Read Also:Ayyappa Pooja: మండలపూజ వేళ ఈ స్తోత్రపారాయణం చేస్తే పట్టిందల్లా బంగారమే అవుతుంది
ప్రధాని మోడీ అయోధ్య పర్యటన
ప్రధాని మోడీ శనివారం అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. దీనితో పాటు మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య విమానాశ్రయం, అయోధ్య రైల్వే స్టేషన్ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఎన్హెచ్-27, ధరమ్ పాత్, లతా మంగేష్కర్ చౌక్, రామ్ పథ్, తేదీ బజార్ మీదుగా అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ప్రధాని మోడీ రోడ్ షో దాదాపు 15 కి.మీ పొడవునా ఉంటుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!