PM Modi: ఈరోజు 7 కీలక సమావేశాలు నిర్వహించనున్న ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు (ఆదివారం) ముఖ్యమైన అంశాలను కవర్ చేసే సుమారు 7 సమావేశాలను నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించి, రెమల్ తుఫాను అనంతర పరిస్థితిని సమీక్షించే సమావేశంతో ప్రారంభం కానుంది.
ఇటీవలి తుఫాను గణనీయమైన నష్టాన్ని మిగిల్చింది. తక్షణ అంచనా, సమన్వయ సహాయక చర్యలు అవసరం. అలాగే.. దేశంలోని వివిధ ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న హీట్వేవ్ పరిస్థితులపై దృష్టి సారించే సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో తీవ్ర ఉష్ణోగ్రతలతో 33 మంది ఎన్నికల అధికారులు చనిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. దేశ వ్యాప్తంగా తీవ్ర ఎండలు, వేడిగాలులతో అనేక మరణాలు నమోదయ్యాయి. జూన్ 5న జరగనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ముందు, భారీ ఎత్తున వేడుకల సన్నాహాలను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి సమావేశం నిర్వహించనున్నారు.
Also Read
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
Rohit Sharma-Fan: ప్లీజ్ ఏమనొద్దు.. పోలీసులకు రోహిత్ శర్మ రిక్వెస్ట్ (వీడియో)!
అదే విధంగా.. ప్రభుత్వ 100 రోజుల ఎన్నికల అనంతర కార్యక్రమానికి సంబంధించిన ఎజెండాను సమీక్షించేందుకు విస్తృత మేధోమథన సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో బీజేపీ రాబోయే రోజుల్లో కీలకమైన విధాన కార్యక్రమాలు, పాలనా వ్యూహాలపై దృష్టి సారించే అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలతో పాటు.. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈరోజు సమావేశంలో చర్చించనున్నారు.
సమావేశాల్లోని ముఖ్యమైన అంశాలు..
తుపాను అనంతర పరిస్థితి, ఈశాన్య రాష్ట్రాల్లో సమీక్షించేందుకు ప్రధాని మోడీ తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఆ తర్వాత దేశంలో విపరీతమైన వేడి పరిస్థితులపై సమీక్షించేందుకు మోడీ సమావేశం కానున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లను సమీక్షించేందుకు ప్రధాని సమావేశం కానున్నారు.
అనంతరం 100 రోజుల కార్యక్రమం ఎజెండాను సమీక్షించేందుకు మోదీ సుదీర్ఘ మేధోమథన సమావేశం నిర్వహించనున్నారు.
కొత్త ప్రభుత్వం కోసం 100 రోజుల ఎజెండాను సిద్ధం చేసే కసరత్తును ప్రధాని ప్రారంభించారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!