PM Modi: ఈరోజు 7 కీలక సమావేశాలు నిర్వహించనున్న ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు (ఆదివారం) ముఖ్యమైన అంశాలను కవర్ చేసే సుమారు 7 సమావేశాలను నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించి, రెమల్ తుఫాను అనంతర పరిస్థితిని సమీక్షించే సమావేశంతో ప్రారంభం కానుంది.
ఇటీవలి తుఫాను గణనీయమైన నష్టాన్ని మిగిల్చింది. తక్షణ అంచనా, సమన్వయ సహాయక చర్యలు అవసరం. అలాగే.. దేశంలోని వివిధ ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న హీట్వేవ్ పరిస్థితులపై దృష్టి సారించే సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో తీవ్ర ఉష్ణోగ్రతలతో 33 మంది ఎన్నికల అధికారులు చనిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. దేశ వ్యాప్తంగా తీవ్ర ఎండలు, వేడిగాలులతో అనేక మరణాలు నమోదయ్యాయి. జూన్ 5న జరగనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ముందు, భారీ ఎత్తున వేడుకల సన్నాహాలను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి సమావేశం నిర్వహించనున్నారు.
Also Read
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
Rohit Sharma-Fan: ప్లీజ్ ఏమనొద్దు.. పోలీసులకు రోహిత్ శర్మ రిక్వెస్ట్ (వీడియో)!
అదే విధంగా.. ప్రభుత్వ 100 రోజుల ఎన్నికల అనంతర కార్యక్రమానికి సంబంధించిన ఎజెండాను సమీక్షించేందుకు విస్తృత మేధోమథన సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో బీజేపీ రాబోయే రోజుల్లో కీలకమైన విధాన కార్యక్రమాలు, పాలనా వ్యూహాలపై దృష్టి సారించే అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలతో పాటు.. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈరోజు సమావేశంలో చర్చించనున్నారు.
సమావేశాల్లోని ముఖ్యమైన అంశాలు..
తుపాను అనంతర పరిస్థితి, ఈశాన్య రాష్ట్రాల్లో సమీక్షించేందుకు ప్రధాని మోడీ తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఆ తర్వాత దేశంలో విపరీతమైన వేడి పరిస్థితులపై సమీక్షించేందుకు మోడీ సమావేశం కానున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లను సమీక్షించేందుకు ప్రధాని సమావేశం కానున్నారు.
అనంతరం 100 రోజుల కార్యక్రమం ఎజెండాను సమీక్షించేందుకు మోదీ సుదీర్ఘ మేధోమథన సమావేశం నిర్వహించనున్నారు.
కొత్త ప్రభుత్వం కోసం 100 రోజుల ఎజెండాను సిద్ధం చేసే కసరత్తును ప్రధాని ప్రారంభించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!