PM Modi: జెలెన్స్కీతో మోడీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక ప్రకటన
- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోడీ భేటీ
- ఉక్రెయిన్ యుద్ధంపై కీలక ప్రకటన
- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
- బ్రిటన్ ప్రధాని రిషి సునక్ లతో ప్రధాని చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఔట్రీచ్ సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. శుక్రవారం నాడు ప్రపంచంలోని ప్రముఖ నేతలతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. సాయంత్రం వరకు ప్రధాని మోడీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. మూడోసారి ప్రధాని అయినందుకు మోడీని కలిసిన ప్రతి దేశాధినేత అభినందనలు తెలిపారు. ఇటలీలోని అపులియా నగరంలో జరిగిన ఈ సమావేశం ప్రపంచ శక్తులతో భారతదేశ సంబంధాల కొనసాగింపు, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయనుంది.
ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా.. భారత్ కూడా తన దౌత్యంలో మార్పులను సూచించింది. శుక్రవారం అపులియాలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కలిసిన ప్రధాని మోడీ, ‘ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ చాలా ఆసక్తిగా ఉంది’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం.. చైనాతో రష్యాకు పెరుగుతున్న స్నేహం దృష్ట్యా, ప్రధాని మోడీ ప్రకటన చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
రష్యా-ఇండియా చాలా కాలం నుంచి భాగస్వామి దేశాలుగా ఉన్నాయి. భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి చాలా రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తుంది. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడిని భారత్ ఇంకా బహిరంగంగా ఖండించలేదు. మరోవైపు.. జీ7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోడీ వరుసగా రెండోసారి భేటీ అయ్యారు. గతేడాది జపాన్లో తొలిసారిగా మోడీ, జెలెన్స్కీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఉక్రెయిన్-రష్యా వివాదానికి పరిష్కారం చర్చలు, దౌత్యం ద్వారానే సాధ్యమవుతుందన్న భారతదేశ పాత వైఖరిని మోడీ పునరుద్ఘాటించారు. ‘ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చాలా ఫలవంతమైన సమావేశం జరిగింది. ఉక్రెయిన్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది’. అని మోడీ తెలిపారు.
Tamarind: చింతపండుతో ఎన్ని లాభాలో..!
మరోవైపు.. ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మధ్య జరిగిన చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన ప్రతి అంశం చర్చకు వచ్చింది. మోడీ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తెలిపారు, ‘ప్రధాని సునక్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మూడోసారి ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, బ్రిటన్ల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చాను. సెమీకండక్టర్, టెక్నాలజీ మరియు వాణిజ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి చాలా సంభావ్యత ఉంది. రక్షణ రంగంలో సహకారాన్ని పెంచుకోవడంపై కూడా చర్చ జరిగింది’. అని మోడీ పేర్కొన్నారు.
అంతే కాకుండా.. 2030 సంవత్సరం నాటికి తమ లక్ష్యాల గురించి ఇరువురు నేతలు మాట్లాడుకున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియా, బ్రిటన్ 2030 నాటికి అనేక ముఖ్యమైన రంగాలలో తమ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. భారతదేశం-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి జరుగుతున్న పురోగతిపై ఇరువురు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. 2024 జూలైలో జరిగే యూకే (UK) సాధారణ ఎన్నికల తర్వాత FTAపై ఒప్పందం త్వరలో ఖరారు అయ్యే అవకాశం ఉందన్నారు. వరుసగా మూడోసారి ఎన్నికల్లో గెలుపొందినందుకు ప్రధాని మోడీని సునక్ అభినందించారు.
Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతున్నారా.. ఇలా ట్రై చేయండి..
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ప్రధాని మోడీ భేటీలో రెండు ప్రధాన అంశాలపై చర్చించారు. ముందుగా ‘హారిజన్-2047’ కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు రెండు దేశాల మధ్య తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. రెండవది.. ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం నిర్ణయించిన రోడ్మ్యాప్ అమలుపై రెండు దేశాల మధ్య చర్చ జరిగింది. 2023లో ప్రధాని మోడీ ఫ్రాన్స్ను సందర్శించినప్పుడు.. ఈ హారిజన్-2047 ఒప్పందంపై సంతకం చేశారు. దీని కింద.. రక్షణ, వాణిజ్యం మరియు ఇతర వ్యూహాత్మక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాల కోసం 2047 సంవత్సరం వరకు లక్ష్యాలు నిర్దేశించారు. ఇందులో రక్షణ రంగంలో సహకారం కూడా ఉంది.
ఈ ఒప్పందం భారతదేశ అవసరాలకు అనుగుణంగా రక్షణ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి.. భారతదేశంలో వాటిని తయారు చేయడానికి ఫ్రెంచ్ కంపెనీలను అనుమతిస్తుంది. దీనిపై మోడీ, మాక్రాన్ మధ్య చర్చ జరిగింది. అంతే కాకుండా.. 2025లో ఫ్రాన్స్లో రెండు ముఖ్యమైన సమావేశాలు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు UN ఓషన్స్ కాన్ఫరెన్స్) జరగబోతున్నాయి. ఇందులో ఇండియా ముఖ్య పాత్ర పోషించనుంది. దీనిపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..