Crime News: మైనర్ బాలికపై అత్యాచారం.. పరారీలో నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఓ మైనర్ బాలికపై, 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసినట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లకు చెందిన 14 ఏళ్ల బాలికపై ఇదే పట్టణానికి చెందిన షేక్ సుబాని(45) అత్యాచారం చేసి పరారైనట్లు ఆయన తెలిపారు. బాధితురాలి తల్లి వరంగల్ జిల్లా చెందిన ఓ వ్యక్తితో 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. రెండేళ్లకి కుమార్తె పుట్టింది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకుంది. అనంతరం కూతుర్ని తీసుకొని బతుకుదెరువు కోసం కోదాడకు వచ్చింది. కోదాడలో నివాసం ఉంటున్న ఆమెకు నేరేడుచర్ల మండలంలోని గ్రామానికి చెందిన ఓ లారీ డ్రైవర్ పరిచయమయ్యాడు. అతన్ని వివాహం చేసుకుని నేరేడుచర్లకు వచ్చింది. గత ఏడాది కాలంగా నేరేడుచర్లలో అద్దె ఇంట్లో ఈమె కూతురు, భర్తతో కలిసి ఉంటుంది.
Read Also: Road Accident : కారు – ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- 705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
వీరి పక్క ఇంట్లోనే షేక్ సుబాని నివాసం ఉంటున్నాడు. సుబాని భార్యతో విభేదించి గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నాడు. నేరేడుచర్లలో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. బాధితురాలు, షేక్ సుబానీలు ఇరువురు కుటుంబాలు ఒకే ఇంట్లో పక్కపక్క రూములలో అద్దెకు ఉంటున్నారు. షేక్ సుబాని, సహజీవనం చేస్తున్న మహిళ మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ జరగడంతో ఆమె రాత్రి బాధితురాలి ఇంట్లో పడుకుంది. సుబాని మాత్రం అద్దె ఇంట్లోనే ఉన్నాడు. సుబానితో సహజీవనం చేస్తున్న మహిళకు ఇదే వీధిలో సొంత ఇల్లు ఉంది. బాధితురాలి తల్లితో కలిసి ఆమె శనివారం ఆ ఇంటి వద్దకు వెళ్లింది. బాధితురాలు కూడా వారితో అక్కడే ఉంది. తల్లి ఇంటికి వెళ్లి అన్నం పెట్టుకు రమ్మని చెప్పడంతో, బాధితురాలు వారు ఉంటున్న అద్దె ఇంటికి వచ్చింది. సుబాని అది గమనించాడు. ఒంటరిగా వుండడంతో సుబాని బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమెను బలవంతంగా అత్యాచారం చేసి గోడదూకి పారిపోయాడు. బాలిక ఈ విషయం తల్లికి చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటనా ప్రాంతాన్ని హుజూర్నగర్ సీఐ చలమంద రాజు పరిశీలించారు. నిందితుడిని పట్టుకోవడం కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!