Perni Nani: మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. ఆ అధికారులపై చర్యలు తప్పవు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: వచ్చే నెల 4వ తేదీ తర్వాత మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. పక్షపాత ధోరణితో వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని.. మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్ను కలిసిన వైసీపీ నేతల బృందం.. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.. బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, గవర్నర్తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. ఉద్దేశ పూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీ తెచ్చింది. అతని వల్లే ఈ విధ్వంసం అని ఆరోపించారు. ఇక, హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే మాట్లాడారు. సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు కోరారని తెలిపారు.. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదని మండిపడ్డారు..
Read Also: Rashmi Gautam : చేతిలో వైన్ గ్లాస్.. కిక్ లో రష్మీ.. రచ్చ మాములుగా లేదుగా..
Also Read
ఎన్నికలు పక్షపతం లేకుండా ఏక పక్షంగా జరిగేలా ఎవరు చేశారో గవర్నర్ కు తెలిపాం అన్నారు పేర్ని నాని.. హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు ఉంటాయని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు అని గవర్నర్ కు తేలిపాం అన్నారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు.. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారని విమర్శించారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదు.. జిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్ లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్ ను కోరాం అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!