O Panneerselvam: డీఎంకేలో చేరిన జయలలిత ఆప్తుడు, మాజీ సీఎం పన్నీర్ సెల్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
O Panneerselvam: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. సీఎం ఎంకే స్టాలిన్ స్వయంగా ఆయనకు శాలువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. “నేను సంతోషంగా డీఎంకేలో చేరాను.. మళ్ళీ తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో అధికారంలో వస్తారు.. పళణి స్వామి ఎఐడీఎంకేను నాశనం చేస్తాడు.. పళణి స్వామి ఒక నియంత.. ఏఐడీఎంకేలో ఏ నాయకుడు ఎదగడానికి లేకుండా కుట్రలు చేస్తున్నాడు.. పళని స్వామి ఎన్నికలలో ఇంక ఎప్పుడూ గెలవలేడు.. ఏఐడీఎంకేకు ఇక భవిష్యత్తు లేదు.. పళణి స్వామి ఇచ్చిన హామలను ప్రజలు పట్టించుకోవడం లేదు.” అని వ్యాఖ్యానించారు.
Also Read
- Rocket Explosion: బ్లూ ఆరిజిన్కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
- AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
- Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
- Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
ఇక.. 2001లో పెరియకులం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు పన్నీర్సెల్వం.. మొదటి సారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత జయలలితా మంత్రివర్గంలో ఆదాయ శాఖ మంత్రిగా పని చేశారు. టాన్సీ కేసు నేపథ్యంలో 2001 సెప్టెంబర్ 21 – 2002 మార్చి 1 వరకు తొలి సారి సీఎం అయ్యారు. 2014లో అక్రమ ఆస్తుల కేసులో జయలలితా జైలుకెళ్లడంతో రెండోసారి సీఎం అయ్యారు. ఆమె మరణం తర్వాత మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2017 ఫిబ్రవరి 7న స్మారక స్థలంలో ధర్మయుద్ధం ప్రకటించారు.. రెండేళ్ళ క్రితం ఏఐడీఎంకే నుంచి బహిష్కరించారు.. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమితో రామనాథపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత పార్టీలో చేర్చే అవకాశం లేదని ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. తాజాగా డీఎంకేలో చేరారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘ఇది చాలా అవమానకరం’.. వైభవ్ సూర్యవంశీని అతడితో పోల్చడం ఏంటి?
-
Rocket Explosion: బ్లూ ఆరిజిన్కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
-
AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
-
Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!