Pemmasani: గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో ప్రచారంలో స్పీడ్ పెంచిన పెమ్మసాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రాం 116వ జయంతి సందర్భంగా గుంటూరులోని స్థానిక పట్టాభిపురం, మార్కెట్ ఏరియాలోని ఆయన విగ్రహాలకు డాక్టర్ పెమ్మసాని, బూర్ల రామాంజనేయులు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అత్యంత ప్రభావవంతమైన నాయకులు బాబు జగ్జీవన్ రాం అన్నారు. ఆనాటి పరిస్థితుల్లో ఉన్న వ్యత్యాసాలు, అడ్డంకులను కూడా లెక్కచేయకుండా తన గలాన్ని బలంగా వినిపించిన నాయకుడు అని పేర్కొన్నారు. ఆయన నాయకత్వ పటిమను స్ఫూర్తిగా తీసుకొని నాయకులుగా ఎదగాలని తెలిపారు. అప్పుడే దళిత సోదరులు గళం బలంగా వినపడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
Read Also: Manish sisodia: మనీష్ సిసోడియాకు చుక్కెదురు.. మళ్లీ రిమాండ్ పొడిగింపు
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ఇక, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో గల ముట్లూరు గ్రామంలో డాక్టర్ పెమ్మసాని రోడ్ షో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలా చూడటం, విద్యా, ఆర్థిక పరంగా వృద్ధిలోకి తీసుకురావటం అనే అంశాలను మాత్రమే చూస్తూ ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారన్నారు. కానీ కాపు సోదరులంతా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉన్నారనే కోపంతో జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ప్రజలను ఒక పార్టీకి, ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కట్టేయలేదన్నారు. కష్ట సమయంలో టీడీపీకి అండగా ఉండి పొత్తులకు సహకరించిన పవన్ కళ్యాణ్ కు, ఆ పార్టీ కార్యకర్తలకు అండగా టీడీపీ, తాను ఉంటామని పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు.
Read Also: Arun singh : ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ
అయితే, గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి మోహన్, తన అనుచరులతో కలిసి 2 వేల మంది గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. గుంటూరు నుంచి ఉండవల్లి వరకు నాయకులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు డాక్టర్. పెమ్మసాని తన రాజకీయ చతురతను ప్రారంభించారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలను చేరుస్తున్నారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నారు. పలు పార్టీల నాయకులు టీడీపీలో చేరేట్టుగా ఆయన చక్రం తిప్పుతున్నారు.
తాజావార్తలు
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!