Pemmasani: గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో ప్రచారంలో స్పీడ్ పెంచిన పెమ్మసాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రాం 116వ జయంతి సందర్భంగా గుంటూరులోని స్థానిక పట్టాభిపురం, మార్కెట్ ఏరియాలోని ఆయన విగ్రహాలకు డాక్టర్ పెమ్మసాని, బూర్ల రామాంజనేయులు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అత్యంత ప్రభావవంతమైన నాయకులు బాబు జగ్జీవన్ రాం అన్నారు. ఆనాటి పరిస్థితుల్లో ఉన్న వ్యత్యాసాలు, అడ్డంకులను కూడా లెక్కచేయకుండా తన గలాన్ని బలంగా వినిపించిన నాయకుడు అని పేర్కొన్నారు. ఆయన నాయకత్వ పటిమను స్ఫూర్తిగా తీసుకొని నాయకులుగా ఎదగాలని తెలిపారు. అప్పుడే దళిత సోదరులు గళం బలంగా వినపడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
Read Also: Manish sisodia: మనీష్ సిసోడియాకు చుక్కెదురు.. మళ్లీ రిమాండ్ పొడిగింపు
Also Read
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
ఇక, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో గల ముట్లూరు గ్రామంలో డాక్టర్ పెమ్మసాని రోడ్ షో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలా చూడటం, విద్యా, ఆర్థిక పరంగా వృద్ధిలోకి తీసుకురావటం అనే అంశాలను మాత్రమే చూస్తూ ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారన్నారు. కానీ కాపు సోదరులంతా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉన్నారనే కోపంతో జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ప్రజలను ఒక పార్టీకి, ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కట్టేయలేదన్నారు. కష్ట సమయంలో టీడీపీకి అండగా ఉండి పొత్తులకు సహకరించిన పవన్ కళ్యాణ్ కు, ఆ పార్టీ కార్యకర్తలకు అండగా టీడీపీ, తాను ఉంటామని పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు.
Read Also: Arun singh : ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ
అయితే, గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి మోహన్, తన అనుచరులతో కలిసి 2 వేల మంది గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. గుంటూరు నుంచి ఉండవల్లి వరకు నాయకులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు డాక్టర్. పెమ్మసాని తన రాజకీయ చతురతను ప్రారంభించారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలను చేరుస్తున్నారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నారు. పలు పార్టీల నాయకులు టీడీపీలో చేరేట్టుగా ఆయన చక్రం తిప్పుతున్నారు.
తాజావార్తలు
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!