Pawan Kalyan: పిఠాపురంలో నాల్గో రోజు జనసేనాని పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ పిఠాపురం అసెంబ్లీ నియోజకర్గం పైనే ఉంది.. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సారి పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే.. ఇక, తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు జనసేన చీఫ్.. పిఠాపురంలో ఆయన పర్యటన నాల్గో రోజుకు చేరుకుంది.. ఈ రోజు ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్న జనసేనాని.. బషీర్ బీబీ దర్గాను సందర్శించనున్నారు.. ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలతో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు.. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రచారం, వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, పిఠాపురంలో జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నేతలకు సన్మానం చేయనున్నారు పవన్ కల్యాణ్.
Read Also: Bigg Boss Keerthi : దారుణంగా మోసపోయిన కీర్తి.. పోలీస్ స్టేషన్ కు పరుగులు.. ఏమైందంటే?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కాగా, పిఠాపురంలో టీడీపీ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు.. సోమవారం జనసేన గూటికి చేరారు.. పార్టీ కండువాలు కప్పి.. జనసేనలోకి ఆహ్వానించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బ్లేడ్లతో కోస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, తనను కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి మూకలు కూడా ఉన్నాయన్న ఆయన.. వాళ్లు బ్లే్డ్లతో కోస్తున్నారని ఆరోపణలు గుప్పించడం చర్చగా మారింది.. నన్ను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు ప్రతీ రోజూ వస్తున్నారు.. అందులో కొందరు కిరాయిమూకలు కూడా ఉంటున్నాయి అని విమర్శించారు.. అలా వచ్చే కిరాయి మూకలు సన్న బ్లేడ్లతో నన్ను, నా సెక్యూరిటీని కోస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఎన్నికల తరుణంలో తన భద్రతపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!