JP Nadda: “ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే”.. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: విద్యార్థి ఉద్యమాలు, పోలీస్ చర్యలు, పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనలతో దేశ రాజకీయం తీవ్ర ఉత్కంఠగా మారింది. విద్యార్థి నేతలపై పోలీసుల దాడులపై అధికార, ప్రతిపక్షాల నడుమ పార్లమెంట్ వేదికగా విమర్శల యుద్ధం నడిచింది. నిరసనల్లో పాల్గొనే విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం సహజమేనని, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసు చర్యలు పూర్తిగా సమర్థనీయమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవారు పోలీస్ చర్యలకు సిద్ధపడాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) రోజుల్లో విద్యార్థి నాయకుడిగా ఉన్న తాను కూడా క్లాస్రూమ్ నుంచే రెండుసార్లు అరెస్ట్ అయ్యానని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అయితే బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యానికి, ప్రజల ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఘాటుగా విమర్శించారు. జులై 20న విద్యార్థి నిరసనకారులపై క్రూరంగా దాడి చేసిన వాళ్లు ఇంకా నిర్భయంగా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఈ పోలీస్ క్రూరత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే పార్లమెంట్లో సమాధానం చెప్పాలని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. మరోవైపు, సీపీఐ(ఎమ్) జాతీయ కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు అకస్మాత్తుగా ప్రవేశించి, విద్యార్థి నాయకురాలు ఐషే ఘోష్ను అరెస్ట్ చేయడానికి యత్నించిన ఘటన ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనడమే ఆమె చేసిన ఏకైక నేరమా అని సీపీఐ(ఎమ్) ఎంపీ జాన్ బ్రిట్టాస్ రాజ్యసభలో ప్రశ్నించారు. ఒక జాతీయ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి చొరబడి దాడులు చేయడంపై తాను స్వయంగా పోలీసులను నిలదీశానని, అయితే 2021 నాటి జేఎన్యూ నిరసన కేసును సాకుగా చూపించారని ఆయన ఆరోపించారు. విపక్షాల నిరసనలను అణచివేయడానికే కేంద్రం ఇలాంటి దమనకాండకు ఒడిగడుతోందని దుయ్యబట్టారు.
Also Read
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
- Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
- Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్లో ఆ మాటలు వినిపించవు
సభలో ఇతర కార్యకలాపాలు చేపట్టే ముందే హోంమంత్రి దీనిపై ప్రకటన చేయాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో లోక్సభ తీవ్ర గందరగోళంగా మారింది. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడటానికి ముందు కూడా ప్రతిపక్షాలు రగడను కొనసాగించడంతో, సభను వాయిదా వేస్తానని స్పీకర్ హెచ్చరించాల్సి వచ్చింది. మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ.. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించి, బలప్రయోగం చేయడం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలం నాటి రజకార్ల అణచివేత కంటే అత్యంత ఘోరంగా ఉందని, దేశంలో అణచివేత వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
JP Nadda: “ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే”.. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్
-
రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
-
AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?