Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఓటమి
- పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఓటమి
- బెల్జియం చేతిలో 2-1 తేడాతో ఓడిన భారత హాకీ జట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్లో సెమీ ఫైనల్స్లో కూడా బెల్జియం భారత్ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో బెల్జియం 2-1తో భారత్ను ఓడించింది. భారత్ తరఫున అభిషేక్ సింగ్ 18వ నిమిషంలో గోల్ సాధించాడు. బెల్జియం తరఫున తిబౌట్ స్టాక్బ్రూక్స్, జాన్ డోహ్మెన్ గోల్స్ చేశారు. తొలి క్వార్టర్లో భారత్ పొరపాట్లు చేయగా 8వ నిమిషంలో బెల్జియంకు తొలి పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే, మొదటిసారి అమిత్ రోహి దాస్ సేవ్ చేయగా, మళ్లీ శ్రీజేష్ అద్భుతమైన సేవ్ చేశాడు. 10వ నిమిషంలో అభిషేక్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసేందుకు ప్రయత్నించగా.. బెల్జియం గోల్ కీపర్ గోల్ అనుమతించలేదు. తొలి క్వార్టర్లో గోల్లు నమోదు కాలేదు.
Also Read
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
రెండో క్వార్టర్లో భారత్ ముందంజ
రెండో క్వార్టర్లో భారత్ దూకుడుగా ఆడి తొలి గోల్ చేసింది. 18వ నిమిషంలో బెల్జియం డిఫెండర్లను దాటవేస్తూ అభిషేక్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేశాడు. అంతకుముందు వివేక్ సాగర్ షాట్ మిస్ అయితే, అభిషేక్ ఎలాంటి పొరపాటు చేయలేదు. 23, 24 నిమిషాల్లో బెల్జియంకు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే శ్రీజేష్ అద్భుతంగా ఆదుకున్నాడు. 25వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను భారత్ మిస్ చేసుకుంది. 26వ నిమిషంలో టామ్ బూన్ గ్రీన్ కార్డ్ పొంది రెండు నిమిషాల పాటు మైదానం వీడాడు. తొలి అర్ధభాగంలో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
మూడో క్వార్టర్లో బెల్జియం ముందంజ
మూడో క్వార్టర్లో భారత్ ఒత్తిడితో ఆడుతున్నట్లు కనిపించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న బెల్జియం 33వ నిమిషంలో థిబ్యూ స్టాక్బ్రోక్స్ ఫీల్డ్ గోల్తో జట్టును సమం చేసింది. 43వ, 44వ నిమిషాల్లో బెల్జియంకు పెనాల్టీ కార్నర్ లభించగా, దాన్ని శ్రీజేష్ కాపాడాడు. అయితే, 44వ నిమిషంలో జాన్ డోహ్మెన్ చేసిన గోల్తో బెల్జియం 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్కు కూడా పెనాల్టీ కార్నర్ లభించినా అమిత్ రోహి దాస్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
నాలుగో క్వార్టర్లో ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. 51వ నిమిషంలో భారత్కు గోల్ చేసే అవకాశం లభించినా, అభిషేక్, సుమిత్ గోల్ చేయలేకపోయారు. బెల్జియంకు పెనాల్టీ కార్నర్ లభించినా దానిని గోల్గా మార్చలేకపోయింది. 54వ నిమిషంలో రాజ్కుమార్ పాల్కు ఎల్లో కార్డ్ లభించింది. చివరి నిమిషంలో భారత్కు పెనాల్టీ కార్నర్ లభించింది, కానీ భారత్ గోల్ చేయలేకపోయింది, దీంతో భారత్ 2-1తో మ్యాచ్ను కోల్పోయింది.
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!