Site icon NTV Telugu

Vikram Misri: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది: విక్రమ్ మిస్రీ

Vikram Misri1

Vikram Misri1

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని.. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. సరిహద్దు పొడవునా పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని. ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించినట్లు వెల్లడించారు. సైన్యం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చామన్నారు. కొన్ని గంటలుగా పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని చెప్పారు. ఇది అత్యంత దుర్మార్గమన్నారు.

READ MORE: Cease Fire Violation : గుజరాత్‌లో పాకిస్థాన్ డ్రోన్లు.. రాష్ట్ర మంత్రి కీలక సూచనలు…

శనివారం భారత్ పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను అమలు చేయాలని నిర్ణయించారు. అయితే.. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో అంధకారం మధ్య పాక్ డ్రోన్‌ను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నాయి. పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరోవైపు.. గుజరాత్‌లోని కచ్‌లో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ అన్నారు. “కచ్ జిల్లాలో అనేక డ్రోన్లు కనిపించాయి. ఇప్పుడు పూర్తిగా బ్లాక్‌అవుట్ అమలు చేయబడింది. దయచేసి సురక్షితంగా ఉండండి, భయపడవద్దు” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Exit mobile version