Nobel Peace Prize: ‘ట్రంప్ నిజంగా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు’.. ట్రంప్ను నామినేట్ చేసిన పాకిస్తాన్
- ట్రంప్ నిజంగా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు
- ట్రంప్ను నామినేట్ చేసిన పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో యుద్ధాలను ఆపడంలో తాను ముఖ్యమైన పాత్ర పోషించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇంతలో, పాకిస్తాన్ ప్రభుత్వం 2026 నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును అధికారికంగా ప్రతిపాదించింది. 2025లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాత్మక దౌత్య జోక్యం, మధ్యవర్తిత్వం కారణంగా ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read:DSP : మళ్లీ ఫాంలోకి వచ్చిన దేవి శ్రీ.. ‘కుబేరా’ తో హ్యాట్రిక్ కొట్టాడుగా
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
భారతదేశంతో కాల్పుల విరమణ తీసుకురావడంలో ట్రంప్ జోక్యాన్ని పాకిస్తాన్ ప్రశంసించింది. ట్రంప్ ప్రయత్నాల కారణంగా కాల్పుల విరమణ సాధ్యమైందని, పెద్ద యుద్ధ ముప్పును నివారించగలిగామని ఆ ప్రకటన పేర్కొంది. దీనివల్ల రెండు అణ్వాయుధ శక్తుల మధ్య యుద్ధం జరిగే అవకాశం తప్పిందని పేర్కొంది. ఈ అవార్డుకు ఆయన నిజంగా అర్హుడని తెలిపింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతిస్పందనగా ఇస్లామాబాద్ ఆపరేషన్ బన్యన్ ఉన్ మార్సూస్ ను ప్రారంభించిందని పాకిస్తాన్ తెలిపింది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను వేగంగా పెంచింది. కానీ ట్రంప్ జోక్యం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడింది. ఈ జోక్యం ట్రంప్ శాంతి స్థాపకుడిగా పాత్రకు రుజువు. చర్చల ద్వారా ఈ వివాదాన్ని ముగించాలనే ఆయన నిబద్ధతకు కూడా ఇది రుజువు.
Also Read:Padmavati Express: పద్మావతి ఎక్స్ ప్రెస్ లో చోరి.. 40 గ్రాముల బంగారం అపహరణ
అయితే, నోబెల్ శాంతి బహుమతి రాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైరాశ్యం వ్యక్తంచేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రిపబ్లిక్ ఆఫ్ రువాండా మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చామని మీకు చెప్పడానికి నేను సంతోషంగా ఉన్నానని ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించారు. ఈ రెండింటి మధ్య యుద్ధం దశాబ్దాలుగా రక్తపాతానికి ప్రసిద్ధి చెందింది. ఇది ఆఫ్రికాకు, ప్రపంచానికి కూడా గొప్ప రోజు. కానీ దీనికి నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదని అన్నాడు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి రాదని ఆయన అన్నారు. సెర్బియా, కొసావో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి రాదని, ఈజిప్ట్, ఇథియోపియా మధ్య శాంతిని పునరుద్ధరించినందుకు నాకు నోబెల్ బహుమతి రాదని అన్నారు.
తాజావార్తలు
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్కు మారిన ‘418’ రిలీజ్!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?