Off The Record: ఒక్క మాట.. పార్టీకి పెద్ద డ్యామేజ్ చేస్తుందా..? ఇంతకీ ఏంటా మాటలు? అన్నదెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: సమకాలీన రాజకీయాల్లో మాట్లాడేవాడే మొనగాడు. పలుకుల కేసరికే.. ఓట్లు ఉసిళ్ల పుట్టలాగా వస్తాయి. మరి.. అలాంటప్పుడు నాలుక ఎంత జాగ్రత్తగా ఉండాలి? తూలనాడటంలో తులం అటుఇటైనా తేడా కొట్టేస్తది. గత లోక్ సభ ఎన్నికలప్పుడు ఆవేశంలో కేసీఆర్ ఒక్కమాట జారినందుకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. హిందూగాళ్లు బొందుగాళ్లు అన్న ఒక్క డైలాగ్ రెండు సీట్లను ఉల్టాపల్టా చేసేసింది. నాడు కరీంనగర్లో ప్రచారం సందర్భంగా.. రామజన్మ భూమి ఏందివయా.. రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అంటూ ఉంటాయా.. అని స్పీచ్ దంచేశారు కేసీఆర్. ఆ ఒక్కమాటతో ఉత్తర తెలంగాణలో పార్టీకి గత్తర లేచినంత పనైంది. ఇంకేముంది.. కరీంనగర్తో పాటు నిజామాబాద్ కూడా బెడిసికొట్టింది. ఆ రెండు స్థానాలను బీజేపీ ఎగరేసుకుపోయింది. కరీంనగర్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న వినోద్ కుమార్ నీరుగారి పోయారు. దాదాపు 90వేల మెజారిటీతో బండి సంజయ్ విజయభేరీ మోగించారు. భూకంపం పుట్టిస్తా.. అని కేసీఆర్ తరచుగా అంటుంటారు.
నిజమే…. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన కరీంనగర్లో పుట్టించిన భూంకపం.. దాని తాలూకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నిజామాబాద్లో చూపించాయి. కరడుగట్టిన హిందూవాదులున్న ఇందూరులో హిందూగాళ్లు బొందుగాళ్లు అన్న డైలాగ్ కారుకింద డైనమేట్లా పేలింది. నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంటులో ధర్మపురి అర్వింద్ కవితపై 70వేల పైచిలుకు మెజారిటీతో కాషాయ జెండా ఎరగేశారు. సారు.. కారు.. పదహారు.. నినాదం ఒక్కమాటతో తేడా కొట్టేసింది. అదే డైలాగుని పట్టుకుని బీజేపీ గోదావరిని ఈది పడేసింది. ఇటు ఆంతరంగికుడు, ఆత్మీయుడు వినోద్ కుమార్, అటు కన్న కూతురు కవిత.. ఇద్దరూ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ డైలాగ్ ఎఫెక్ట్ అక్కడితో ఆగలేదు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో సెగ రేపింది. గ్రేటర్ ఎన్నికల్లో హిందూవాదం మెయిన్ ఫ్యాక్టర్ కావడంతో.. ఇక లాభం లేదని నష్టనివారణ చర్యలకు దిగాల్సి వచ్చింది. మా రాముడు రాముడు కాదా.. మా భద్రాద్రి భద్రాద్రి కాదా అని అన్నారు. అందుకు మోడీ సమాధానం చెప్పిన తర్వాత హిందూ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. అయినా సరే, డామేజీ కంట్రోల్ కాలేదు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సగానికి సగం సీట్లు కొట్టేసింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఇప్పుడు కూడా అలాంటి తొట్రుపాటే సీటు కిందికి నీళ్లు తెస్తుందా అన్న చర్చ జరుగుతోంది పార్టీలో. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో సెటిలైన సీమాంధ్రులు, టీడీపీ మద్దతుదారులు నిరసనలు తెలిపారు. దానిపై స్పందించిన కేటీఆర్ ఏపీ రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధం అని మండిపడ్డారు. ఏం చేసుకోవాలన్నా… వెళ్లి ఏపీలో చేసుకోండని ఉచిత సలహా ఇచ్చారాయన. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు కేటీఆర్. అందుకు సమాధానంగా సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఘాటైన పోస్టులు పెట్టారు. నాడు ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఆందోళనలు జరగలేదా అని ప్రశ్నించారు. పైపెచ్చు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారి బీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నాక కూడా ఇంకా ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని అంటారెందుకంటూ లాజిక్లు లాగారు. పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన కారు పార్టీ పెద్దలు నష్ట నివారణగా ఇంకో లైన్ అందుకోవాల్సి వచ్చింది. కేటీఆర్ స్వయంగా ఎన్ని వివరణలు ఇచ్చినా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్న విశ్లేషణలున్నాయి. అదే క్రమంలో ఏపీ రోడ్లను, తెలంగాణ రోడ్లను పోలుస్తూ చాలా సభల్లో కేసీఆర్ డామేజ్ కంట్రోల్ చేయాల్సి వస్తోంది. జగన్ పాలనని విమర్శిస్తే టీడీపీ అభిమానులు చల్లబడతారని.. ఈ లైన్ అందుకున్నారట కేసీఆర్. అంతమాత్రాన జగన్ సపోర్టర్స్ ఈ మాటల్ని ఉపేక్షిస్తారనుకుంటే పొరపాటే. ఏది ఏమైనా… కీలక స్థానంలో ఉన్న నేతలు ఒక్క మాట బ్యాలెన్స్ తప్పినా… పరిణామాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ప్యాచ్ వర్క్ ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!