Boxing : ఆడాళ్లు.. మీకు జోహార్లు.. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బరిలో నిఖత్ జరీన్
ఢిల్లీలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు దుమ్ముదులిపారు. ఏకంగా నలుగురు భారత బాక్సర్లు ఫైనల్ చేరగా వారిలో శనివారం తలబడిన ఇద్దరు బాక్సర్లు కూడా స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. 48 కేజీల విభాగంలో తలబడిన 22 ఏళ్ల నీతూ గన్ గాన్, ఫైనల్ లో మంగోలియాకి చెందిన లూసాయ్ ఖాన్ అల్టాంట్ సెట్ సెగ్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. 81 కేజీల విభాగంలో పోటీపడిన 30 ఏళ్ల స్వీటీ బుర్రా( సవిటీ బుర్రా ), చైనా బాక్సర్ వాంగ్ లీనాపై 4-3 తేడాతో గెలిచి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం అందుకుంది. 2006లో భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్, మొట్టమొదటిసారిగా భారత్ తరపున ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెలిచింది.
Also Read : PK SDT: నెల రోజుల్లో కంప్లీట్ అయ్యింది… ఏప్రిల్ 5 నుంచి పవన్ ర్యాంపేజ్
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
म्हारी छोरी छोरयां तै कम है के..#Worldboxingchampionship में 48 Kg भार वर्ग में नीतू घनघस को स्वर्ण पदक जीतने पर हार्दिक बधाई।
इसके साथ ही 81 Kg में स्वीटी बूरा ने स्वर्ण पदक जीता दोनों बेटियों को बहुत-बहुत बधाई शुभकामनाएं।हरियाणा की बेटियों की गौरवपूर्ण उपलब्धि पर नाज है। pic.twitter.com/zlaHcTATnX
— Sunita Duggal ,Former MP (@SunitaDuggal7) March 26, 2023
ఈ విజయం నాకు చాలా స్పెషల్.. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కోసం ఎంతో కష్టపడ్డాను. 2012 నుంచి బాక్సింగ్ చేస్తున్నా.. ప్రతీ విషయంలో నా కుటుంబం నాకు అండగా నిలిచింది.. నా ఊరు మొత్తం నన్ను ప్రోత్సహించింది.. బర్మింగ్ హమ్ లో జరిగిని కామన్వెల్త్ గేమ్స్ లో ఆడుతున్నప్పటి నుంచి నా కోసం వాళ్లు ప్రార్థిస్తున్నారు అని నీతూ గన్ గాన్ తెలిపారు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ చూడడానికి మా ఊరి నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారని నీతూ గన్ గాన్ తెలిపింది. మా ఊరు భీవానీలోని ధనన గ్రామానికి చెందిన వ్యక్తిని అంటూ నీతూ గన్ గాన్ పేర్కొంది. ఇప్పటికే 2015,2017 లో యూత్ వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలిచిన నీతూ.. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ లో పతకం గెలవడమే లక్ష్యంగా నీతూని సిద్దం చేస్తున్నామని ఆమె కోచ్, ఒలింపిక్ మెడల్ విన్నర్ విజేందర్ సింగ్ అన్నారు.
Also Read : Rajahmundry Incident: గొంతు నులిమి… టీడీపీ నేతపై అర్థరాత్రి దుండగుల దుశ్చర్య
ఈ రోజు జరిగే ఫైనల్ లో మరో ఇద్దరు భారత బాక్సర్లు తలపడబోతున్నారు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తో పాటు ఒలింపిక్ మెడలిస్ట్ లవ లీన్ బోరోహెన్ కూడా పసిడి వేటలో ఉన్నారు. 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్, నేటి సాయంత్రం 6 గంటలకు వియత్నాం బాక్సర్ గుయెన్ తి టామ్ తో తలపడనుంది. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు లవ్ లీనా, ఆస్ట్రేలియా బాక్సర్ అన్నే పార్కర్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
తాజావార్తలు
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!