Nitish Kumar Reddy: శుభవార్త.. కెప్టెన్గా నితీశ్ కుమార్ రెడ్డి!
- కెప్టెన్గా నితీశ్ కుమార్ రెడ్డి
- ఏపీఎల్ 2025లో భీమవరం బుల్స్ కెప్టెన్గా నితీశ్
- ఇంగ్లండ్ పర్యటనలో నితీశ్ రెడ్డి
- భీమవరం బుల్స్ టీమ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Reddy Bhimavaram Bulls Captain in APL 2025: తెలుగు ఆటగాడు, భారత్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కెప్టెన్ అయ్యాడు. అయితే నితీశ్ రెడ్డి సారథి అయింది టీమిండియాకు కాదండోయ్.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025లో భీమవరం బుల్స్ ఫ్రాంచైజీ కెప్టెన్గా నియమించబడ్డాడు. ఈ విషయాన్ని భీమవరం బుల్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా విశాఖలో జరిగిన వేలంలో నితీశ్ రెడ్డిని రూ. 10 లక్షలకు బుల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. ఇప్పటికే మూడు టెస్టులు ఆడిన అతడు.. నాలుగో టెస్ట్ కోసం సిద్దమవుతున్నాడు. ఈ సిరీస్ ఆగష్టు 4న ముగుస్తుంది. ఆపై భీమవరం బుల్స్ జట్టులో చేరనున్నాడు. ఏపీఎల్ 2025 ఆగప్ట్ 8న ప్రారంభమై.. 24న ముగుస్తుంది. ఈ టోర్నీ విశాఖ స్టేడియంలో జరుగనుంది. ఇప్పటికే ఏపీఎల్లో మూడు సీజన్లు ముగియగా.. నాలుగో ఎడిషన్ త్వరలో ప్రారంభం కానుంది. లీగ్లో ఈసారి 7 జట్లు పాల్గొంటాయి. అమరావతి లయన్స్, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైనర్స్ బరిలోకి దిగుతున్నాయి. కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్ ఛాంపియన్లుగా నిలిచాయి.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడు. అతడిని గత వేలంలో రూ. 6 కోట్లకు అట్టిపెట్టుకుంది. నితీశ్ భారత్ తరపున టీ20, టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. నితీష్ రెడ్డి ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఆడుతున్నాడు. మొదటి రెండు మ్యాచ్లలో బ్యాటింగ్లో రాణించలేదు కానీ.. లార్డ్స్ టెస్ట్లో బౌలింగ్లో ప్రభావం చూపాడు. నితీశ్ తన నాయకత్వంలో భీమవరం బుల్స్ ఫ్రాంచైజీ కప్ అందిస్తాడేమో చూడాలి.
Also Read: IND vs ENG: ఆడే మ్యాచ్లను ఎంచుకోవడం ఏంటి?.. బుమ్రాపై భారత్ మాజీ కెప్టెన్ ఫైర్!
భీమవరం బుల్స్ టీమ్:
నితీష్ కుమార్ రెడ్డి (కెప్టెన్), హరి శంకర్ రెడ్డి, హేమంత్ రెడ్డి, సత్యనారాయణ రాజు, పిన్నిటి తేజస్వి, సాయి శ్రవణ్, టి వంశీ కృష్ణ, మునీష్ వర్మ, ఎం యువన్, కె రేవంత్ రెడ్డి, బి సాత్విక్, సాయి సూర్య తేజ రెడ్డి, శశాంక్ శ్రీవత్స్, సి రవితేజ, సిహెచ్ శివ, ఎన్ హిమాకర్, కశ్యప్ ప్రకాశ్, భస్వంత్ కృష్ణ, జె విష్ణు దత్తా, భువనేశ్వర్ రావు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!