Nirmala Sitharaman: బానిస మనస్తత్వాన్ని తొలగిస్తేనే కల సాకారం అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనసులో ఉన్న బానిస మనస్తత్వాన్ని తొలగించడం ద్వారానే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ కల సాకారం అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒడిశాలో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయంలో పూజలు చేశారు. ఆమేతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, స్థానిక ఎమ్మెల్యే జయంత్ సారంగి, లలితేందు విద్యాధర్ మహపాత్ర ఉన్నారు.
Tiger Nageswara Rao: 8 ఏళ్లకే రక్తం తాగిన స్టూవర్టుపురం దొంగ సర్ వాడు..
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. బ్రిటిషర్లు నెలకొల్పిన బానిస మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని.. అప్పుడే 2047లో భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేసి స్వయం సమృద్ధిగా మారుస్తామని ప్రమాణం చేశారు. వలసవాద మనస్తత్వానికి సంబంధించిన ప్రతి చిహ్నాన్ని తొలగిస్తామని తెలిపారు. దేశాన్ని రక్షించేవారిని గౌరవిస్తామని.. పౌరుని యొక్క అన్ని బాధ్యతలను నెరవేరుస్తామని పేర్కొ్న్నారు.
Upendra: దళితులపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన ఉపేంద్ర
‘మేరీ మాటి, మేరా దేశ్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. అమరవీరుల గౌరవార్థం మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ సందర్భంగా.. పాఠశాల, కళాశాల విద్యార్థులు కలిసి త్రివర్ణాలతో భారతదేశ మ్యాప్ను రూపొందించారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ధరించిన దుస్తులతో అంతా కలిసి.. దేశ పటం ఆకారంలో నిల్చొని దేశభక్తిని చాటుకున్నారు. మరోవైపు పూరీ జిల్లాలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జయీ రాజ్గురు జన్మస్థలమైన బిర్హర్కృష్ణపూర్లో మేరీ మాతి, మేరే దేశ్ అభియాన్ ఆధ్వర్యంలో అమృత్ కలాష్ లో మట్టిని సేకరించారు. అనంతరం పూరీ జిల్లాలో ప్రచారంలో భాగంగా.. అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సీతారామన్ సన్మానించారు. అంతేకాకుండా ప్రఖ్యాత ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన ‘మేరి మతి, మేరా దేశ్’ శాండ్ ఆర్ట్ సెషన్ను నిర్మలా సీతారామన్ వీక్షించారు. అనంతరం పూరీలో చెట్ల పెంపకం కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!