Courier Scam Alert: మార్కెట్లోకి కొత్తగా కొరియర్ స్కాం.. డబ్బు ఎలా కొట్టేస్తారు? ఎలా సేఫ్ గా ఉండాలంటే?
New Courier Scam Alert: ఇప్పుడు సైబర్ దొంగలు జనాన్ని మోసం చేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. అదే కొరియర్ స్కామ్. ఇప్పటి వరకు దేశంలో చాలా మంది కొరియర్ స్కామ్ల బారిన పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అయితే రేపు మీరే కొరియర్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ లో టార్గెట్ అవచ్చు. అయితే కొరియర్ స్కామ్ అంటే ఏమిటి? దానిని నివారించడానికి మార్గం ఏమిటి? అనేది తెలుసుకుందాం పదండి
ప్రస్తుతం భారతదేశంలో కొత్త తరహా స్కామ్ జరుగుతోంది అదే కొరియర్ స్కామ్. మన భారతదేశంలో మోసానికి సంబంధించిన ఏదైనా పద్ధతి వెలుగులోకి వచ్చిన వెంటనే, కేటుగాళ్ళు వెంటనే ఇతర పద్ధతులను కనుగొంటారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు అదే కొరియర్ స్కామ్. ఇప్పటి వరకు మన దేశంలో చాలా మంది కొరియర్ స్కామ్ల బారిన పడి లక్షల రూపాయలు మోసపోయారు. ఇటీవల కొరియర్ స్కామ్ ద్వారా పీహెచ్డీ విద్యార్థిని బలి అయింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో జరిగిన ఒక చీటింగ్ విషయంలో ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రముఖ కంపెనీ ఫెడెక్స్ పేరుతో సైబర్ దుండగులు అతని నుంచి రూ.1,34,650 మోసం చేశారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Rakesh Master: రాకేష్ మాస్టర్ పేరిట జాతీయ పురస్కారం
నిషేధిత వస్తువులతో అతని పేరు మీద కొరియర్ వచ్చిందని దుండగులు విద్యార్థికి ఫోన్ చేశారు. ఆ విద్యార్థిని మరో కాల్ మరో దుండగుడు వీడియో కాల్ చేసి తాను ముంబై నార్కోటిక్స్ విభాగానికి చెందిన అధికారినని చెప్పాడు. స్కైప్ కాల్ ద్వారా విద్యార్థి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసి వెరిఫికేషన్ కోసం విద్యార్థి బ్యాంక్ ఖాతా సమాచారం కూడా కోరారు. అతనికి ఎండీఎంఏ (డ్రగ్స్) సరఫరాలో ప్రమేయం ఉందని ఆరోపించడమే కాదు ఈ కేసులో నిర్దోషిగా బయటపడేందుకు బాధితుడి నుంచి రూ.1,34,650 లూటీ చేసి అతని చేతే మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించారు. ఇక గతంలో ఇదే తరహాలో ముంబైకి చెందిన ఓ మహిళ రూ.1.97 లక్షలు మోసపోయింది. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఇదే పార్శిల్ స్కామ్ కింద 4.47 కోట్లు మోసపోయాడు.
కొరియర్ స్కామ్ అంటే ఏమిటి?
కొరియర్ స్కామ్ అనేది ఒక కొత్త తరహా మోసం. ఈ స్కామ్లో సైబర్ దుండగులు కస్టమ్స్ అధికారులుగానో, కొరియర్ కంపెనీ అధికారులుగానో నటిస్తూ ప్రజలకి ఫోన్లు చేసి డ్రగ్స్ లేదా కస్టమ్స్ పేరుతో భయపెడతారు. వారు ప్రజలకు ఫోన్ చేసి నిషేదిత సరుకులతో కూడిన పార్శిల్ వచ్చిందని భయపెట్టి స్కైప్ కాల్స్ చేస్తారు. ఆ తర్వాత బ్యాంకు ఖాతా సమాచారం తీసుకుని వెరిఫికేషన్ పేరుతో మోసం చేస్తారు.
ఈ కొరియర్ స్కామ్ ఎలా నివారించాలి?
అసలు మీరు ఏ కొరియర్ ఆర్డర్ చేయకపోతే, మీకు కొరియర్ కాల్స్ ఎందుకు వస్తాయి? ఒకవేళ వస్తే కనుక అలాంటి కాల్స్ కు సమాధానం ఇవ్వవద్దు. ఎవరైనా పదే పదే ఇబ్బంది పెడితే ఆ నంబర్ బ్లాక్ చేసి సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. కస్టమ్ డిపార్ట్మెంట్ పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే అతనితో మాట్లాడకండి, బ్యాంక్ వివరాలు వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. ఎవరైనా మీకు వెబ్ లింక్ పంపితే, దానిపై క్లిక్ చేయకండి. అటువంటి స్కామ్లను 155260కి కాల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.inలో ఆన్లైన్లో రిపోర్ట్ చేయండి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!