NGT: పంజాబ్లో 53.87 టన్నుల వ్యర్థాలు.. ప్రభుత్వానికి రూ.1026 కోట్ల జరిమానా!
- పంజాబ్ ప్రభుత్వానికి షాక్
- రూ.1026 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ
- పంజాబ్లో ప్రస్తుతం 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రభుత్వానికి గురువారం రూ.1026 కోట్ల జరిమానా విధించింది. పాత వ్యర్థాలు, మురుగునీటి విసర్జన నిర్వహణపై ఖచ్చితమైన చర్యలు తీసుకోనందుకు పంజాబ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఈ జరిమానా విధించింది. ఈ కేసులో విచారణ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పంజాబ్లో ప్రస్తుతం 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలు పడి ఉన్నాయని పేర్కొంది. రెండేళ్ల క్రితం ఈ వ్యర్థాలు 66.66 లక్షల టన్నులు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించగలిగిందని ఎన్జిటి మందలించింది.
READ MORE: Mamata banerjee: ప్రధాని మోడీకి సీఎం మమత లేఖ.. ఏం డిమాండ్ చేశారంటే..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
పంజాబ్లో ప్రస్తుతం 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలు పడి ఉన్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించగలిగింది. పనులు ఇదే వేగంతో కొనసాగితే 53.87 లక్షల టన్నుల పాత వ్యర్థాలను పారవేసేందుకు 10 ఏళ్లు పడుతుందని ఎన్జీటీ పేర్కొంది. అదే సమయంలో.. రింగ్-ఫెన్సుడ్ ఖాతా సృష్టికి సంబంధించి 2022 సంవత్సరపు ఆర్డర్ను అనుసరించడంలో ప్రధాన కార్యదర్శి విఫలమయ్యారని ఎన్జీటీ తన కొత్త ఉత్తర్వులలో పేర్కొంది. 2022లో రూ.2080 కోట్లు ఇవ్వాలని ఆదేశించారని, దానిని ప్రధాన కార్యదర్శి పాటించలేదని తెలిపింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రూ.100 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసిందని వివరించింది. ఎన్జీటీ చట్టం 2010లోని సెక్షన్ 26 ప్రకారం ఆర్డర్ను ఉల్లంఘించడం, ఆర్డర్ను పాటించకపోవడం నేరమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 27న జరగనుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!