MH 370 Plan Crash: ఎనిమిదేళ్ల తర్వాత వీడిన ఎంహెచ్ 370 మిస్టరీ.. విమానం ఎక్కడుందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MH 370 Plan Crash: ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 370 సముద్రంలో కూలిపోయిందని నిపుణులు నిర్ధారించారు. 25 రోజుల క్రితం మడగాస్కర్లోని మత్స్యకారుల ఇంట్లో దొరికిన విమాన శకలాలను శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాత నిపుణులు ఈ అభిప్రాయానికి వచ్చారు. విమానాన్ని ఉద్దేశపూర్వకంగానే కూల్చినట్లు తొలి ఆధారాలు లభించాయని ఎన్హెచ్ 370 శిథిలాల వేటగాళ్లు బ్రిటిష్ ఇంజినీర్ రిచర్డ్ గాడ్ఫ్రే, అమెరికన్ బ్లెయిన్ గిబ్సన్ తెలిపారు.
మార్చి 8, 2014న 239 మంది ప్రయాణికులతో విమానం అదృశ్యమైంది. అనంతరం విమానం, అందులోని ప్రయాణికుల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. విమానం అదృశ్యంపై అనేక పుకార్లు వెలువడ్డాయి. 2017లో ఫెర్నాండో తుఫాను తర్వాత, మడగాస్కర్లో ఒడ్డుకు కొట్టుకువచ్చిన విమానం ల్యాండింగ్ గేర్ డోర్ను టాటాలీ అనే మత్స్యకారుడు తీసుకొచ్చి ఇంటిలో ఉంచాడు. తటాలి భార్య వీటిని బట్టలు ఉతకడానికి వాషింగ్ బోర్డ్గా ఉపయోగిస్తోంది. విమానం ల్యాండింగ్ గేర్, డోర్ భాగాలపై పగుళ్లు, గీతలు ఉన్నాయని బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్ఫ్రే చెప్పారు. సముద్రంలో కూలిపోయిన తర్వాత అది పూర్తిగా శిథిలమైపోతుందని నిర్ధారించేందుకు పైలట్ ప్రయత్నించినట్లు నిపుణులు భావిస్తున్నారు. డోర్ పైన ఉన్న నాలుగు సెమీ-సమాంతర పగుళ్లు ఆధారంగా విమానానికి ఉన్న రెండు ఇంజన్లలో ఒకటి విఫలమైనందునే దానిని కిందకి దింపినట్లు నిపుణులు నిర్ధారించారు. విమానాన్ని పూర్తిగా రెండుగా చీల్చే విధంగా విమానం ల్యాండింగ్ చేసినట్లు గాడ్ఫ్రే, గిబ్సన్ చెప్పారు.
Also Read
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
Read Also: Gas Crisis: గృహవినియోగదారులకు షాక్.. రోజులో 8గంటలే గ్యాస్ సరఫరా
మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళుతుండగా ఎంహెచ్ 370 అదృశ్యమైంది. విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ చనిపోయినట్లు భావిస్తున్నారు. 227 మంది ప్రయాణికుల్లో 153 మంది చైనా జాతీయులు. ప్రమాదం జరిగిన సమయంలో మలేషియా పైలట్ జహారీ షా విమానం అదుపులో ఉన్నారు. షా ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చివేసినట్లు మొదట్లో ఆరోపణలు వచ్చాయి, అయితే షా కుటుంబ సభ్యులు, స్నేహితులు దానిని ఖండించారు. టేకాఫ్ అయిన 38 నిమిషాల తర్వాత విమానంతో చివరి కమ్యూనికేషన్ జరిగింది. ఆ సమయంలో విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా ఉంది. ఆ తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయి.
Read Also: Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..
ఎంహెచ్ 370 కోసం జరిగిన అన్వేషణ విమానయాన చరిత్రలోనే అత్యంత ఖరీదైనది. 2015- 16లో, హిందూ మహాసముద్రం ఒడ్డు నుండి వెలికితీసిన శిధిలాలు ఎంహెచ్ 370 అని నిర్ధారించబడింది. విమానం అదృశ్యం గురించి చాలా పుకార్లు ఉన్నాయి, కానీ ఏదీ నిరూపించబడలేదు. విమానం అదృశ్యంపై మలేషియా ప్రభుత్వం కూడా అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంహెచ్ 370 గురించి పలు డాక్యుమెంటరీలు, నవలలు కూడా వచ్చాయి.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!