Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Man Hides Mother’s Body In House For Days: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించి రోజులు గడుస్తున్నా.. ఆమె మృతదేహంతోనే రోజుల తరబడి ఉన్న కుమారుడి వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గుల్రిహా ప్రాంతంలో 45 ఏళ్ల వ్యక్తి మరణించిన తన తల్లి మృతదేహాన్ని రోజుల తరబడి ఇంట్లోనే దాచిపెట్టాడని పోలీసులు మంగళవారం వెల్లడించారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే తల్లి అంత్యక్రియలను నిర్వహించలేకపోయానని ఆ వ్యక్తి పోలీసులకు వెళ్లడించారు. అయితే సదరు వ్యక్తి మద్యానికి బానిసయ్యాడని.. మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.
Read Also: Nuclear Fusion Breakthrough: కేంద్రక సంలీన చర్యలో కీలక ముందడుగు..శాస్త్రవేత్తల ప్రకటన
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శివపూర్-షాబజ్ గంజ్ సదరు వ్యక్తి ఇంటికి చేరుకున్న పోలీసులు చనిపోయిన శాంతిదేవి(82) మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. మరణించిన మహిళను రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా గుర్తించారు. మహిళ చనిపోయి నాలుగైదు రోజులు అయినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళ కుమారుడు నిఖిల్ మిశ్రా అలియాస్ డబ్బు మద్యానికి బానిసై మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. అసలు ఇంట్లో ఏం జరిగిందో చెప్పలేకపోయాడని తెలిపారు. అయితే తన తల్లి 5 రోజుల క్రితం మరణించిందని.. డబ్బులు లేకపోవడంతోనే అంత్యక్రియలు చేయలేదని చెప్పాడు.
మిశ్రా అతని భార్య, పిల్లలు ఇదే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే మిశ్రాతో గొడవపడిన అతని భార్య 15 రోజుల క్రితమే కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అంతకుముందు కొంతమంది ఇదే ఇంట్లో అద్దెకు ఉండేవారని.. అయితే మిశ్రా ప్రవర్తన నచ్చకపోవడంతో వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని.. తదుపరి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!