Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Man Hides Mother’s Body In House For Days: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించి రోజులు గడుస్తున్నా.. ఆమె మృతదేహంతోనే రోజుల తరబడి ఉన్న కుమారుడి వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గుల్రిహా ప్రాంతంలో 45 ఏళ్ల వ్యక్తి మరణించిన తన తల్లి మృతదేహాన్ని రోజుల తరబడి ఇంట్లోనే దాచిపెట్టాడని పోలీసులు మంగళవారం వెల్లడించారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే తల్లి అంత్యక్రియలను నిర్వహించలేకపోయానని ఆ వ్యక్తి పోలీసులకు వెళ్లడించారు. అయితే సదరు వ్యక్తి మద్యానికి బానిసయ్యాడని.. మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.
Read Also: Nuclear Fusion Breakthrough: కేంద్రక సంలీన చర్యలో కీలక ముందడుగు..శాస్త్రవేత్తల ప్రకటన
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శివపూర్-షాబజ్ గంజ్ సదరు వ్యక్తి ఇంటికి చేరుకున్న పోలీసులు చనిపోయిన శాంతిదేవి(82) మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. మరణించిన మహిళను రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా గుర్తించారు. మహిళ చనిపోయి నాలుగైదు రోజులు అయినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళ కుమారుడు నిఖిల్ మిశ్రా అలియాస్ డబ్బు మద్యానికి బానిసై మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. అసలు ఇంట్లో ఏం జరిగిందో చెప్పలేకపోయాడని తెలిపారు. అయితే తన తల్లి 5 రోజుల క్రితం మరణించిందని.. డబ్బులు లేకపోవడంతోనే అంత్యక్రియలు చేయలేదని చెప్పాడు.
మిశ్రా అతని భార్య, పిల్లలు ఇదే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే మిశ్రాతో గొడవపడిన అతని భార్య 15 రోజుల క్రితమే కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అంతకుముందు కొంతమంది ఇదే ఇంట్లో అద్దెకు ఉండేవారని.. అయితే మిశ్రా ప్రవర్తన నచ్చకపోవడంతో వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని.. తదుపరి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!