Gas Crisis: గృహవినియోగదారులకు షాక్.. రోజులో 8గంటలే గ్యాస్ సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Crisis: పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీ తీవ్ర గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో రోజులో ఎనిమిది గంటలు మాత్రమే గ్యాస్ సరఫరా చేయగలమని సెమీ గవర్నమెంట్ నేచురల్ గ్యాస్ ప్రొవైడర్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశీయ వినియోగదారుల కష్టాలు పెరిగాయి. సుయ్ సదరన్ గ్యాస్ కంపెనీ (SSGC) ఇప్పుడు కరాచీలోని గృహ వినియోగదారులకు భోజన సమయం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మొత్తం మీద రోజులో 8 గంటలు మాత్రమే గ్యాస్ సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కరాచీలో నెలరోజులుగా గ్యాస్ వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుతం, కంపెనీ తీసుకున్న నిర్ణయంతో దేశీయ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రధాని సూచనల మేరకే గ్యాస్ సరఫరాపై ఈ ప్రకటన విడుదల చేసినట్లు కంపెనీ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ లో గ్యాస్ నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. పెరుగుతున్న జనాభా కారణంగా ఇంధనానికి డిమాండ్ బాగా పెరిగింది. గత ఇరవై ఏళ్లుగా కొత్త గ్యాస్ నిల్వలను కనుగొనకపోవడం వల్ల సరఫరా తగ్గుతోంది. దేశం ప్రస్తుతం 44:56 నిష్పత్తిలో దిగుమతి చేసుకున్న స్వదేశీ వనరుల ద్వారా దాని ఇంధన అవసరాలను తీరుస్తుంది.
Read Also: Congo: కాంగోలో వరద విలయం.. 120 మంది దుర్మరణం
Also Read
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Lala Amarnath: భారత్కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
విదేశీ గ్యాస్ సరఫరాదారులతో విభేదాలు, ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ కూడా పాకిస్తాన్లో గ్యాస్ సంక్షోభానికి కారణంగా తెలుస్తోంది. ఇది కాకుండా, పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత, తప్పుడు విధానాలు, భద్రతా సమస్యలు, బలహీనమైన ఒప్పందాలు కూడా విదేశీ సంస్థలు చమురు, గ్యాస్ సరఫరా రంగంలో పెట్టుబడులు పెట్టకుండా నిరోధించాయి. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభం కావడంతో గ్యాస్ సరఫరా సమయం ఖరారు కావడంతో కరాచీ వాసుల కష్టాలు మరింత పెరిగాయి. నగరంలో ప్రజలు చాలా కాలంగా విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నారు. నివేదికల ప్రకారం, నగరంలోని దాదాపు ప్రతి ప్రాంతం కొన్ని వారాలుగా పీక్ అవర్స్లో కరెంట్, గ్యాస్ కొరత దుర్కొంటోంది. దీంతో పాటు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ కూడా సరిగా పనిచేయడం లేదు.
Read Also: Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..
సింధ్ ప్రావిన్స్లోనూ గ్యాస్ సంక్షోభం..
కొన్ని ప్రాంతాల్లో రోజుకు రెండు గంటలకే గ్యాస్ సరఫరా అవుతుందని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. సరఫరాలో సమయంలో వినియోగదారులు ఆహారాన్ని వండుకునేందుకు కూడా సరిపడా గ్యాస్ రావడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా ప్రాంతాలలో, ప్రజలు LPG గ్యాస్ సిలిండర్లపై ఆధారపడటం ప్రారంభించారు. దీని కారణంగా వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. సింధ్ ప్రావిన్స్లో సంక్షోభం వేగంగా పెరిగిందని సింధ్ ఇంధన మంత్రి ఇంతియాజ్ షేక్ అంగీకరించారు. ఇది ఆశ్చర్యకరం, ఎందుకంటే సింధ్ దేశంలోనే అత్యధికంగా గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది.
తాజావార్తలు
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!