Gas Crisis: గృహవినియోగదారులకు షాక్.. రోజులో 8గంటలే గ్యాస్ సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Crisis: పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీ తీవ్ర గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో రోజులో ఎనిమిది గంటలు మాత్రమే గ్యాస్ సరఫరా చేయగలమని సెమీ గవర్నమెంట్ నేచురల్ గ్యాస్ ప్రొవైడర్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశీయ వినియోగదారుల కష్టాలు పెరిగాయి. సుయ్ సదరన్ గ్యాస్ కంపెనీ (SSGC) ఇప్పుడు కరాచీలోని గృహ వినియోగదారులకు భోజన సమయం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మొత్తం మీద రోజులో 8 గంటలు మాత్రమే గ్యాస్ సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కరాచీలో నెలరోజులుగా గ్యాస్ వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుతం, కంపెనీ తీసుకున్న నిర్ణయంతో దేశీయ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రధాని సూచనల మేరకే గ్యాస్ సరఫరాపై ఈ ప్రకటన విడుదల చేసినట్లు కంపెనీ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ లో గ్యాస్ నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. పెరుగుతున్న జనాభా కారణంగా ఇంధనానికి డిమాండ్ బాగా పెరిగింది. గత ఇరవై ఏళ్లుగా కొత్త గ్యాస్ నిల్వలను కనుగొనకపోవడం వల్ల సరఫరా తగ్గుతోంది. దేశం ప్రస్తుతం 44:56 నిష్పత్తిలో దిగుమతి చేసుకున్న స్వదేశీ వనరుల ద్వారా దాని ఇంధన అవసరాలను తీరుస్తుంది.
Read Also: Congo: కాంగోలో వరద విలయం.. 120 మంది దుర్మరణం
Also Read
- Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
- UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
- Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
విదేశీ గ్యాస్ సరఫరాదారులతో విభేదాలు, ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ కూడా పాకిస్తాన్లో గ్యాస్ సంక్షోభానికి కారణంగా తెలుస్తోంది. ఇది కాకుండా, పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత, తప్పుడు విధానాలు, భద్రతా సమస్యలు, బలహీనమైన ఒప్పందాలు కూడా విదేశీ సంస్థలు చమురు, గ్యాస్ సరఫరా రంగంలో పెట్టుబడులు పెట్టకుండా నిరోధించాయి. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభం కావడంతో గ్యాస్ సరఫరా సమయం ఖరారు కావడంతో కరాచీ వాసుల కష్టాలు మరింత పెరిగాయి. నగరంలో ప్రజలు చాలా కాలంగా విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నారు. నివేదికల ప్రకారం, నగరంలోని దాదాపు ప్రతి ప్రాంతం కొన్ని వారాలుగా పీక్ అవర్స్లో కరెంట్, గ్యాస్ కొరత దుర్కొంటోంది. దీంతో పాటు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ కూడా సరిగా పనిచేయడం లేదు.
Read Also: Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..
సింధ్ ప్రావిన్స్లోనూ గ్యాస్ సంక్షోభం..
కొన్ని ప్రాంతాల్లో రోజుకు రెండు గంటలకే గ్యాస్ సరఫరా అవుతుందని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. సరఫరాలో సమయంలో వినియోగదారులు ఆహారాన్ని వండుకునేందుకు కూడా సరిపడా గ్యాస్ రావడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా ప్రాంతాలలో, ప్రజలు LPG గ్యాస్ సిలిండర్లపై ఆధారపడటం ప్రారంభించారు. దీని కారణంగా వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. సింధ్ ప్రావిన్స్లో సంక్షోభం వేగంగా పెరిగిందని సింధ్ ఇంధన మంత్రి ఇంతియాజ్ షేక్ అంగీకరించారు. ఇది ఆశ్చర్యకరం, ఎందుకంటే సింధ్ దేశంలోనే అత్యధికంగా గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది.
తాజావార్తలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!