MSD: థాయ్లాండ్లో ధోనీ ఏం చేస్తున్నాడో చూడండి.. కూతురు ముందే..!
- తన కూతురు జీవాతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఎంఎస్ ధోనీ
- ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్లాండ్ టూర్కు వెళ్లిన ఎంఎస్డీ
- బీచ్లో తన కూతురు ముందు ఎంజాయ్ చేస్తున్న ధోనీ
- ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. తమ పిల్లలకు నచ్చే విధంగా మార్చుకుని పిల్లలను అలరిస్తుంటారు. పిల్లల సంతోషం కోసం ఏదీ చేయడానికైనా వెనుకాడరు పేరెంట్స్.. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ కూడా తన కూతురు జీవాతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. భారత మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి థాయ్లాండ్ టూర్కు వెళ్లారు. అక్కడ ఫుటెక్లోని బీచ్లో తన కూతురు ముందు అలలు వస్తుంటే సముద్రంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Malreddy Ranga Reddy: చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు, హెడ్మాస్టర్లు..
Also Read
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
శనివారం జీవా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో బీచ్ ఫోటోలు, వీడియో షేర్ చేసింది. బీచ్లో ధోనీ, జీవా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. జీవా ఒడ్డున నిలబడి ఉండగా, ధోనీ నీటిలోకి దూకుతున్నాడు. కాగా.. ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. “ధోని తన కూతురితో కలిసి బీచ్లో ఒక అందమైన రోజును ఆస్వాదిస్తున్నాడు. వాట్ ఎ లవ్లీ పిక్చర్.’’, ‘‘ఐపీఎల్ వేలానికి ముందు ధోనీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.’’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Koti Deepotsavam Day 1 LIVE : శంఖాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం
ఐపీఎల్ 2025లో ధోనీ ఆడుతున్న సంగతి తెలిసిందే.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ధోనీని 4 కోట్ల రూపాయలకు అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉంచుకుంది. అలాగే.. ఐపీఎల్ మెగా వేలానికి ముందు సీఎస్కే మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు)లను రిటైన్ చేసుకోగా.. ఆ జట్టు వద్ద ఇంకా రూ. 55 కోట్ల పర్స్ మనీ ఉంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!