MP Laxman: మోడీని విమర్శించే వారంతా వారి కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారు..
ముషీరాబద్ అసెంబ్లీలో కవాడిగూడా, రాంనగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన OBC మోర్చా సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డా. లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీనీ ఉద్దేశించి కుటుంబం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.. కానీ యావత్ భారత దేశ ప్రజలను తన కుటుంబం అనుకుని మోడీ పని చేస్తున్నాడు అని తెలిపారు. మోడీకి కుటుంబం లేదని మాట్లాడిన లాలూ ప్రసాద్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం పని చేస్తున్నాడు.. తెలంగాణలో కేటీఆర్ నీ ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ పని చేస్తున్నాడు.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు.. ఇక, జమ్ము కాశ్మీర్ లో అబ్దుల్లా తన కొడుకు రాజకీయం కోసం పని చేస్తున్నాడు.. ఇలా మోడీని విమర్శించే వారంతా వారి వారి కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారు అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
Read Also: China: మాల్దీవులతో మా బంధం ఎవరిని టార్గెట్ చేయదు.. భారత్ని ఉద్దేశించి చైనా వ్యాఖ్యలు..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
కానీ, నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం మాత్రమే పని చేస్తూ.. దేశ ప్రజలే తన కుటుంబమని భావిస్తున్నాడు అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. మోడీకి తోడబుట్టిన వారిలో ఒకరు రేషన్ షాపు నడుపుతుంటే.. మరొకరు బడ్ది కొట్టు నడుపుకుని బ్రతుకుతున్నారు.. మోడీకి కనీసం సొంత ఇల్లు కూడా లేదు.. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఏ హోదాలో ఉన్నారో అందరికీ తెలుసూ.. ఎంపీగా ఓడిపోయిన కేసీఆర్ బిడ్డను బ్యాక్ డోర్ నుంచి ఎమ్మెల్సీనీ చేశాడు అని ఆయన ఆరోపించారు. అంటే, ఎంపీగా ఓడిపోతే 5 ఏళ్లు కూడా తన బిడ్డ అధికారం లేకుండ ఉండలేదని ఎమ్మెల్సీనీ చేశాడు.. ప్రాంతీయ పార్టీల్లో వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారా..? పార్టీలో పని చేస్తున్న యువతకు అవకాశాలు ఉండవా? అనేది ఆలోచించాలి.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రధానిగా పని చేసిన మోడీపై ఒక్క అవినీతి మచ్చ కూడా పడలేదు అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: Balakrishna: బాలయ్యపై కేఎస్ రవికుమార్ అనుచిత వ్యాఖ్యలు.. పిలిచి కొడతాడు అంటూ!
మోడీ ప్రధానిగా ఉంటే వారి అవినీతి కొనసాగడం లేదని సహించడం లేదు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఒక బీసీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు.. దేశ వ్యాప్తంగా ఇళ్లు లేని పేద వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చాడు మన ప్రధాని మోడీ.. బీసీలకు విద్యారంగంలో రిజర్వేషన్ కల్పించి బీసీల పట్ల తన ప్రేమను చాటుకున్నారు.. ఒక వేళ బీసీ రిజర్వేషన్ అమలు చేయని విద్యా సంస్థలపై చట్ట పరమైన చర్యలు తీసుకునే చట్టాన్ని చేశాడు అని ఆయన తెలిపారు. వారు అధికారంలో ఉన్నపుడు గుర్తు రాని కుల గణన పై బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతుంది.. కుల గణన చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.. కానీ అది ఎలా చేస్తారో.. ఎప్పుడు చేస్తారో చెప్పడం లేదు.. ఓక దళితుడిని రాష్ట్రపతినీ చేసిన ఘనత మన మోడీది.. బీసీలను చులకనగా చూస్తున్న ఈ రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో బుద్ది చెప్పాలి.. బీసీల పక్షపాతి మన మోడీనీ మరోసారి ప్రధానినీ చేసి ఆయనకు అండగా నిలుద్ధాం అని ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!