Rahul Gandhi: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. శక్తి వివాదంపై క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా ముంబై వేదికగా ముగింపు సభ నిర్వహించారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన శక్తి వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం చెలరేగింది. తాజాగా శక్తి వివాదంపై రాహుల్ వివరణ ఇచ్చారు.
‘శక్తి’పైనే పోరాటం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ వక్రీకరించారని రాహుల్ గాంధీ తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా క్లారిటీ ఇచ్చారు. మోడీ తన మాటలు ఇష్టపడరని. ఆయన తన మాటలు వక్రీకరించేందుకు, అర్థం మార్చి చెప్పేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎందుకంటే… ఆయనకు తాను లోతైన సత్యాన్ని చెప్పిన విషయం బాగా తెలుసు అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎవరిమీదైతే తాము పోరాటం సాగిస్తున్నామో దానినే శక్తి అని తాను సంబోధించానని.. ఆ శక్తి మోడీనే అని అన్నారు. ఆ శక్తి భారతదేశ వాణి అని, సంస్థలను, సీబీఐ, ఐటీ శాఖ, ఈడీ, ఎన్నికల కమిషన్, మీడియా, పరిశ్రమలు, రాజ్యాంగ వ్యవస్థను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటోందని రాహుల్ వివరించారు. ఆ పవర్తోనే నరేంద్ర మోడీ వేలకోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తుండగా, స్వల్పమైన రుణాలను కూడా తీర్చలేక రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని రాహుల్ విమర్శించారు.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ తెలంగాణలోని జగిత్యాలలో సోమవారం జరిగిన ర్యాలీలో తిప్పికొట్టారు. తమ పోరాటం శక్తితోనేనంటూ ఇండియా కూటమి చెబుతోందని, తన వరకూ ప్రతి తల్లి, చెల్లి, కూతురు అంతా శక్తిస్వరూపాలేనని, శక్తి రూపంలో వారిని ఆరాధిస్తానని, తాను భరతమాత ఆరాధకుడినని చెప్పుకొచ్చారు. ఈ శక్తిని అంతం చేస్తామంటూ ఇండియా కూటమి సవాలును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మోడీ ప్రకటించారు.
మొత్తానికి శక్తి వ్యాఖ్యలు రెండు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోడీ తన వ్యాఖ్యలను వక్రీకరించారని రాహుల్ తిప్పికొట్టారు. ఇదిలా ఉంటే రాహుల్ చేసిన తన తల్లి దగ్గర ఓ సీనియర్ నేత కన్నీళ్లు పెట్టుకున్నారన్న వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ క్లారిటీ ఇచ్చారు. ఆ వ్యా్ఖ్యలు తన గురించి కాదని తెలిపారు.
ఇది కూడా చదవండి:CEO Vikasraj: 85 ఏళ్ళు పైబడిన వారికి హోమ్ ఓటింగ్..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!