MLC Kavitha: కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. స్కూటీలు, బంగారం ఇస్తామని మోసం చేసారు..!
- వరంగల్ జిల్లాలో పర్యటనలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓరుగల్లులోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ఆమె ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆమె ఎల్కతుర్తి లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆపై మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ..
తెలంగాణ ఉనికిని కోల్పోతున్న సమయంలో కేసీఆర్ పిడికిలి బిగించి తెలంగాణ ఉద్యమంతో అందరినీ ఒక్క తాటికి పైకి తెచ్చి తెలంగాణ ను ఉనికి కాపాడాడన్నారు. 2001లో కేసీఆర్ పెట్టిన తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తిచేసుకుందని తెలిపారు. వరంగల్ గడ్డ అంటే ఉద్యమాల గడ్డని, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని.. వరంగల్ లో సభ పడితే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలిపారని గుర్తు చేసారు.
Also Read
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లల్ని మోసం చేసిందని.. స్కూటీలు ఇస్తామని విద్యార్థులు మోసం చేసారని అన్నారు. అలాగే బంగారం ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేసారని తెలిపారు. ఇలా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మహిళలు సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. తెలంగాణ తలపై కాలేశ్వరం నిర్మించి రైతన్నకు మరోసారి ఇచ్చిన కేసీఆర్ కు మద్దతుగా రైతన్నలు పెద్ద ఎత్తున సభలో పాల్గొనలన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో 12 మంది చనిపోతే ఒత్తిడి మేరకు మాత్రమే తెలంగాణ ఇచ్చిందని, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసం చేస్తుంది కుట్రలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆ కుట్రలన్నిటిని పటాపంచలు చేయాలంటే ఈ సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
కేసిఆర్ మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించే లాగా రిజర్వేషన్ తీసుకువచ్చిన ఘనత ఉందని, ఎల్కతుర్తి సభలో ప్రత్యేక మహిళా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నమని, సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని అవ్విడా తెలిపారు. కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. ప్రజలకు నీ మోసం ఏంటో తెలిసిపోయిందని, 16 నెలల్లోనే మీరు ఏమి చేయలేరని తెలంగాణ ప్రజలకు తేలిపోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుల్లారా అవాకలు చెవాకులు పేలుస్తున్నారు. మా సభలో పల్లీలు, బఠానీలు అమ్ముకునే అంత మంది కూడా మీరు ఉండరు. అవాకులు, చివాకులు పేలిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. రూపాంతరం చెందడం అనేది సర్వసాధారణం.. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం మాత్రమే చెందింది.. పార్టీ మారలేదని ఆవిడ మాట్లాడారు.
తాజావార్తలు
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!