Nellore: జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై మంత్రులు రివ్యూ..
- నెల్లూరు జిల్లాలో పరిశ్రమలు.. విమానాశ్రయ ఏర్పాటుపై..
- వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి.. నారాయణ సమీక్ష
- నెల్లూరుకు విమానాశ్రయం ఎంతో అవసరం- మంత్రులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు నగరం చుట్టూ ఉన్న రైస్ మిల్లులను ఇతర ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నామన్నారు. ఒకప్పుడు నగర శివార్లలో ఉన్న ఈ మిల్లులు.. నగరం విస్తరించడంతో నడిబొడ్డులోకి వచ్చాయని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు లేదా కిసాన్ ఎస్.ఈ.జెడ్లోకి మార్చాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. అందుకోసం.. రైస్ మిల్ అసోసియేషన్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. జిల్లాలో కృష్ణపట్నం, రామయ్యపట్నం పోర్టులు, జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి.. వీటికి అనుబంధంగా పరిశ్రమలు రానున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వీటికి విమానాశ్రయం ఎంతో అవసరం.. విమానాశ్రయానికి 13 వందల 79 ఎకరాలు అవసరమని గుర్తించారని అన్నారు. కొంత భూమికి పరిహారం ఇచ్చారు.. ఇంకా భూమిని సేకరించాల్సి ఉందన్నారు. ఈ విషయం పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చిస్తాం.. త్వరలోనే ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రతినిధులు వచ్చి పరిశీలన చేస్తారని మంత్రి తెలిపారు.
Read Also: BC Caste Enumeration : బీసీ కులాల సర్వే ప్రజావాణి సోమవారం నుంచి ప్రారంభం..?
Also Read
- IND Vs SL: టీమిండియాకు షాక్.. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌట్..
- Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
- Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
- Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరుకు విమానాశ్రయం ఎంతో అవసరం అని అన్నారు. టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. వైసీపీ హయాంలో విమానాశ్రయం గురించి పట్టించుకోలేదని తెలిపారు. వేరే ప్రదేశానికి తరలించాలని చూశారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దగదర్తిలోనే పెట్టాలని నిర్ణయించారన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించాను.. భూసేకరణ చేస్తే వెంటనే పనులు మొదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారని అన్నారు. త్వరలోనే ఒక కమిటీని పంపుతామని చెప్పారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Read Also: Bomb Threat: విజయవాడలోని ఓ హోటల్కు బాంబు బెదిరింపు..
తాజావార్తలు
-
IND vs SL: గాలె టెస్టులో అంపైర్ను వణికించిన డీఎస్పీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ ?
-
Psychology Facts: రేపటి దుఃఖాన్ని ఈరోజే ఎందుకు అనుభవిస్తున్నాం? సైకాలజీ ఏం చెబుతోంది?
-
Jana Nayagan OTT Release: ఓటీటీలోకి దళపతి విజయ్ ‘జన నాయగన్’.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
America Vs Iran: డెడ్లైన్ ముగిసింది! యుద్ధమా? లొంగుబాటా?
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!