Minister Seethakka: కాంగ్రెస్ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సచివాలయంలో క్రిష్టియన్ ఎంప్లాయిస్ అసోసియన్ ఆధ్వర్యంలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంగా, ఆనందంగా జరుపుకునే పండుగని అన్నారు. విద్య, వైద్య రంగాలలో కొనియాడదగిన సేవలను క్రైస్తవులు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ కల్పిస్తామని.. ప్రజలందరూ శాంతి, సోదరభావంతో మెలగాలని కోరారు.
Skin Care : చలికాలంలో స్కిన్ డ్రై గా మారిందా? ఈ టిప్స్ మీకోసమే..
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఈ సమావేశానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఎడ్వర్డ్ విలియమ్స్ క్రిస్ట్ మస్ కేక్ ను కట్ చేశారు. అనంతరం విలియమ్స్ మాట్లాడుతూ… పాపములను క్షమించడానికి ఏసు ఈ లోకంలో అవతరించాడని అన్నారు. దేవుని ప్రేమను ఎలా పొందాలి, పంచుకోవాలనే అంశాలపై తెలియజేశారు. క్రిస్మస్ పండగ విశిష్టతనూ వివరించారు. ఏసు ప్రభువు బోధించిన శాంతి సూత్రములను ప్రజలందరూ ఆచరించాలని కోరారు. ప్రోటోకాల్ డైరెక్టర్ అరవిందర్ సింగ్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి విజయకుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.
PM Modi: వారణాసిలో మోడీని ఓడించేందుకు ఇండియా కూటమి బిగ్ ప్లాన్.. పోటీలో ఉండేది వీళ్లేనా.?
సెక్రటేరియట్ చర్చ్ క్వయర్, సభ్యులు, మ్యూజిక్ డైరెక్టర్ పిజెడి కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పాటలు ఆలపించారు. సెక్రెటేరియట్ ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియోషన్ వైస్ ప్రెసిడెంట్ చిట్టిబాబు అధ్యక్షత వహించగా, ప్రెసిడెంట్ లాల్ బహదూర్ శాస్త్రి వందన సమర్పణ చేశారు. అసోసియోషన్ సభ్యులు సువర్ణరాజు, శశిభూషన్, ప్రేమలీల, దేవరాజు, విక్రమ్, మనోరమ, స్వామినాథన్, వసంత్ విప్లవ్, జేకబ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!