Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minister Kakani Govardhan Reddy Shocking Comments On Chandrababu

Kakani Govardhan Reddy: చంద్రబాబు తన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదు..

Published Date :December 14, 2023 , 8:24 pm
By Mahesh Jakki
Kakani Govardhan Reddy: చంద్రబాబు తన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Kakani Govardhan Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు, తుఫానులను ఎలా ఎదుర్కొనాలో తనను చూసి నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారని.. చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తే ఆయనకు పిచ్చి పట్టిందని అర్థమవుతుందని మంత్రి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నేనే డిజైన్ చేశాను అన్నట్టుగా చెప్పారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల కాలంలో పోలవరం గురించి పట్టించుకోలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ వైఎస్సార్ పోలవరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే తుఫాన్ వల్ల రైతుల నష్టపోయారని చంద్రబాబు అంటున్నారని.. పూర్తి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. రైతులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని..వ్యవసాయం దండగని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడారని.. పంటలు వేసుకోలేని పరిస్థితి ఎదుర్కొన్నారని మంత్రి చెప్పారు.

Read Also: Pawan Kalyan: దిక్కే లేకుండా పోయిన ఏపీని గాడిలో పెట్టాలి.. ఒక్కసారి జనసేనను నమ్మండి..

తుఫాన్‌ను తానే సముద్రంలోనే అణచివేశానని చెప్పుకున్నారని.. హుద్ హుద్ తుఫాన్లు ఫోటోలు తీసుకొని తానే అంతా చేసినట్లు ప్రచారం చేసుకున్నారని మంత్రి విమర్శలు గుప్పించారు. అధికారులను గాని స్థానిక ప్రజా ప్రతినిధులను గాని పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు హయాంలో కరువు మండలాలుగా ప్రకటించారే తప్ప కరువు నివారణ చర్యలు తీసుకోలేదని మంత్రి పేర్కొన్నారు. అందుకే దానికి సంబంధించిన డేటా కూడా చెప్పలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబు తన హయాంలో ఒక సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు అయితే ఏవేవో కారణాలు చెప్పి ప్రజల నుంచి సానుభూతి కోసం ప్రయత్నించారన్నారు. తనకు అనారోగ్యమని చెప్పి బెయిల్ తీసుకున్నారని.. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు.. వ్యాధులు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకున్నారని ఆయన మండిపడ్డారు. పంటలు నష్టపోయినప్పుడు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఎప్పుడైనా ఇచ్చారా అంటూ చంద్రబాబును మంత్రి కాకాని ప్రశ్నించారు. ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పంటలకు నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 2015లో భారీ వర్షాల వల్ల మనుబోలు వద్ద జాతీయ రహదారి తెగిపోయిందని.. ఐదేళ్లలో ఈ రహదారిని చంద్రబాబు బాగు చేయలేకపోయారని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పనులు పూర్తయ్యాయని మంత్రి చెప్పుకొచ్చారు.

Read Also: Botsa Satyanarayana: చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్

మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎకరాకు 30 వేల నష్టపరిహారం ఇవ్వాలని చెబుతున్నారు. ఆయన హయాంలో ఎప్పుడైనా ఇచ్చారా?. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారో చంద్రబాబు చెప్పాలి. ఇటీవల చంద్రబాబు పర్యటించిన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులెవరూ రాలేదు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ప్రాణ నష్టం జరగలేదు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్ తుఫానుకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర బృందం జిల్లాల్లో పర్యటిస్తోంది. రైతులకు సంబంధించి ఉదారంగా వ్యవహరిస్తాం. అన్ని విధాలా ఆదుకుంటాం. చంద్రబాబుకు మతిమరుపు ఎక్కువైంది. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి నటించారు.. జైల్లో ఉన్నప్పుడు నటించారు.. ఇప్పుడు బయటకు వచ్చి కూడా నటిస్తున్నారు. చంద్రబాబు దగ్గర చెప్పించుకోవాల్సిన ఆగత్యం ప్రభుత్వానికి లేదు.” అని మంత్రి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • ap politics
  • Minister Kakani Govardhan Reddy
  • tdp
  • telugu news

తాజావార్తలు

  • Polavaram Tiger Alert: పోలవరం జిల్లాలో పులి సంచారం.. గిరిజన గ్రామాల్లో ఆందోళన!

  • Milk Bread Dessert: కేవలం 10 నిమిషాల్లోనే ఫైవ్ స్టార్ రేంజ్ స్వీట్! ఎలా చేయాలో చూసేయండి..

  • Tamil Nadu: ఘోర విషాదం.. బస్సు-వ్యాన్ ఢీ.. 11 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి

  • Summer Heroines : సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ

  • UK Visa: బ్రిటన్ బాదుడు.. భారీగా పెంచేసిన వీసా ఛార్జీలు

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions