Kakani Govardhan Reddy: టీడీపీ హయాంలో కరువు విలయతాండవం చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉండటంతో రైతులకు సంబంధించి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఖరీఫ్ సీజన్ లో ఈసారి సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము.. శాస్త్రవేత్తలు చర్చించి ఏఏ పంటలు వేయాలనే విషయంపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సాధారణ వర్ష పాఠం..574.7 మిల్లీ మీటర్లు ఉండగా 487.2 15 మిల్లీ మీటర్లు నమోదైంది.. 15 శాతం వర్షం తగ్గింది.. ప్రత్యామ్నాయ పంటల కోసం.. రైతులకు సబ్సిడీతో విత్తనాలను సరఫరా చేస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
Read Also: NBK 110 : బాలయ్య 110వ సినిమాను అనౌన్స్ చేశారా? పోస్టర్ ఇదేనా?
Also Read
- Chandrababu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ తయారవుతోంది
- Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ రికార్డు నాకు లెక్క కాదు.. టీ20ల్లో 200 కొట్టి చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ
- Stock Market: లాభాల పంట పండించిన స్టాక్ మార్కెట్.. రేపటి వ్యూహం ఇలా..
- Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్.. దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
అంతేగాక పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది.. పంట నష్టపోయిన రైతులకు బీమా సొమ్ము కూడా చెల్లిస్తున్నాం.. ప్రభుత్వ విధివిధానాల ప్రకారమే. 103 మండలాలను కరువు మండలాలను ప్రకటించారు.. అక్కడ ఇన్ పుట్ సబ్సిడీ తో పాటూ అవసరమైన ఇతర చర్యలను చేపట్టాం.. రబీకి సంబంధించి కూడా పరిస్థితిని సమీక్షించామన్నారు. రెండో విడత రైతు భరోసా నిధులను ఈనెల 7న పుట్టపర్తిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ రైతులకు అందిస్తారు అని చెప్పారు. వాస్తవాలను తెలుసుకోకుండా పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది అని మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Jose Butler: ఈ వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శన.. ఇంగ్లాండ్ కెప్టెన్ తీవ్ర ఆవేదన..!
ఇప్పుడు టీడీపీ నేతలు కరువు ప్రాంతాలు చూస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలో కరువు విలయతాండవం చేస్తే రైతులకు ఏమి చేశారు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు స్టీరింగ్ కమిటీ పేరుతో ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వస్తారు.. టీడీపీ హయాంలో రైతు రథం.. నీరు చెట్టు పేరుతో దోచుకున్నారు.. వ్యవసాయంపై కనీస పరిజ్ఞానం లేని లోకేష్ కూడా లేఖలు రాయడం ప్రారంభించారు.. ఎన్నికలు వస్తున్నాయని ఏదో ఒకటి చేస్తున్నారు.. ఈ ప్రభుత్వ హయాంలో ఏమి చేశారో చెప్పండి.. రైతులకు జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు.. రాష్ట్రంలో కరువు రావాలని పచ్చ మీడియా కోరుకుంటోంది.. పచ్చ పేపర్లు టీడీపీ కరపత్రాలుగా మారాయి.. గతంలో రైతుల ఇబ్బంది పడినప్పుడు ఈ పత్రికలు ఏం చేశాయి.. రైతులకు అండగా నిలవాలని లక్ష్యంతోనే ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Sesha 2016: కిల్లర్ స్కెచ్తో వణికిపోయే పోలీసులు… రాత్రంతా నరకయాతన.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న థ్రిల్లర్ మూవీ
-
Team India: జూన్లో టీమ్ ఇండియా బిజీ బిజీ.. టెస్టులు, టీ20లు, వన్డేలతో సహా ఆరు అంతర్జాతీయ మ్యాచ్లు!
-
Horror Movie on OTT: తరతరాలను వెంటాడే ఆ భయంకర దుష్టశక్తి… ఊహించని ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేస్తున్న హారర్ థ్రిల్లర్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Chandrababu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ తయారవుతోంది
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!