Kakani Govardhan Reddy: పంట నష్టంపై అంచనావేస్తున్నాం.. బురద జల్లొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటను నష్టపోతున్నారు రైతులు.. అయితే, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు.. అనవసరంగా బురద జల్లొద్దని హితవుపలికారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులకు అందుతున్న పథకాలపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు.. చంద్రబాబు హయాంలో అకాల వర్షాల వల్ల పంటలకు నష్టం జరిగితే ఆ సీజన్ లో పరిహారం ఇచ్చారా..? అప్పుడు ఈ పత్రికలు ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పంట నష్టాలు.. ఇన్ ఫుట్ సబ్సిడీని ఆ సీజన్ లోనే ఇస్తున్నాం.. కరువు మండలాల ప్రకటించలేదని రాయడం విచిత్రంగా ఉంది.. ప్రభుత్వం మీద బురద జల్లేందుకు అసత్యాలు రాస్తున్నారు అంటూ మండిపడ్డారు.
Read Also: Mahesh Babu: జక్కన్న గండం దాటించే ధీరుడు ఎవరు?
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.. పంట నష్టాలపై అధికారులు అంచనాలు వేస్తున్నారు అని తెలిపారు మంత్రి కాకాణి.. చంద్రబాబు హయాంలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఎందుకు ప్రశ్నించలేదన్న ఆయన.. చంద్రబాబు బకాయిలను వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత చెల్లించారని తెలిపారు.. రాష్ట్రంలో పంటల పరిస్థితిపై ఇప్పటికిప్పుడు వివరాలు సేకరిస్తున్నాం.. రైతులు నోటిపై చేయని పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.. చంద్రబాబు హయాంలో పసుపు కుంభకోణం జరిగింది.. ఆ విషయం వారికి ఎందుకు తెలియదని నిలదీశారు. రైతు రథం పథకంలో కమీషన్లు దండుకున్నారు.. రైతుల పేరుతో దోచుకున్నారు.. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధరలు వస్తుంటే టీడీపీ నేతలు తట్టుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణా గోవర్ధన్రెడ్డి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?