Minister Jagdish Reddy: వరదలపై ఎందుకు బురద రాజకీయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కురిసిన వర్షాలు, వరద ప్రభావంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు వరదలపై గవర్నర్ ను కలవడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రం నుంచి సహాయం తీసుకురాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను జగదీష్ రెడ్డి ఖండించారు. బీజేపీకి తోక పార్టీ అనేది నిజమనేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించారు.
Read Also: Tiger Nageswara Rao: ఈ గజదొంగను ఆపుతున్న శక్తులు ఎవరు.. అదికూడా చెప్పండి బ్రో
Also Read
గవర్నర్ తమిళిసై బీజేపీ నాయకురాలిగా ప్రవర్తిస్తున్నారు.. ఆమెను వరదల సందర్శనకు రమ్మనడం కాంగ్రెస్ పార్టీ దివాలకోరు తనానికి నిదర్శనమని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ కి ప్రత్యామ్నాయం అయితే మోడీ పెట్టిన గవర్నర్ను ఎందుకు కలిశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వారం రోజుల పాటు కురిసిన వర్షాలపై సీఎం కేసీఆర్ ప్రతిరోజు సమీక్షించారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు రావొద్దని అధికారులకు ఆయన చేసిన ఆదేశాలతో అందరు సమిష్టి కృషితో పని చేశారని పేర్కొన్నారు.
Read Also: Suprem Court: మణిపూర్ డీజీపీకి సుప్రీం నోటీసులు.. సోమవారానికి కేసు వాయిదా
దేశంలో ఏ ప్రభుత్వం తీసుకోని విధంగా ముందే వరద నివారణ చర్యలు చేపట్టామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. వరుసగా నాలుగేండ్ల నుంచి వరదలు వస్తున్నా కేంద్రం పై గానీ.. బీజేపీని ఒక్క మాట మాట్లాడకుండా తమ భక్తిని చాటుతూ ఆ పార్టీకి ఏజెంట్ల మాదిరిగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ లో రాని వరదలకు కేంద్రం నిధులు ఇస్తుంది.. కానీ తెలంగాణకు మాత్రం ఒక్క పైసా ఇవ్వడంలేదని విమర్శలు గుప్పించారు. వరుసగా వరదలపై మూడు సార్లు కేంద్ర బృందాలు వచ్చి పరిశీలించినా నయా పైసా నష్టపరిహారం ఇవ్వలేదని మంత్రి అన్నారు. దీనిపై కాంగ్రెస్ వాళ్లు మాట్లాడకుండా కేసీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?