Minister Jagdish Reddy: వరదలపై ఎందుకు బురద రాజకీయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కురిసిన వర్షాలు, వరద ప్రభావంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు వరదలపై గవర్నర్ ను కలవడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రం నుంచి సహాయం తీసుకురాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను జగదీష్ రెడ్డి ఖండించారు. బీజేపీకి తోక పార్టీ అనేది నిజమనేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించారు.
Read Also: Tiger Nageswara Rao: ఈ గజదొంగను ఆపుతున్న శక్తులు ఎవరు.. అదికూడా చెప్పండి బ్రో
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
గవర్నర్ తమిళిసై బీజేపీ నాయకురాలిగా ప్రవర్తిస్తున్నారు.. ఆమెను వరదల సందర్శనకు రమ్మనడం కాంగ్రెస్ పార్టీ దివాలకోరు తనానికి నిదర్శనమని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ కి ప్రత్యామ్నాయం అయితే మోడీ పెట్టిన గవర్నర్ను ఎందుకు కలిశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వారం రోజుల పాటు కురిసిన వర్షాలపై సీఎం కేసీఆర్ ప్రతిరోజు సమీక్షించారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు రావొద్దని అధికారులకు ఆయన చేసిన ఆదేశాలతో అందరు సమిష్టి కృషితో పని చేశారని పేర్కొన్నారు.
Read Also: Suprem Court: మణిపూర్ డీజీపీకి సుప్రీం నోటీసులు.. సోమవారానికి కేసు వాయిదా
దేశంలో ఏ ప్రభుత్వం తీసుకోని విధంగా ముందే వరద నివారణ చర్యలు చేపట్టామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. వరుసగా నాలుగేండ్ల నుంచి వరదలు వస్తున్నా కేంద్రం పై గానీ.. బీజేపీని ఒక్క మాట మాట్లాడకుండా తమ భక్తిని చాటుతూ ఆ పార్టీకి ఏజెంట్ల మాదిరిగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ లో రాని వరదలకు కేంద్రం నిధులు ఇస్తుంది.. కానీ తెలంగాణకు మాత్రం ఒక్క పైసా ఇవ్వడంలేదని విమర్శలు గుప్పించారు. వరుసగా వరదలపై మూడు సార్లు కేంద్ర బృందాలు వచ్చి పరిశీలించినా నయా పైసా నష్టపరిహారం ఇవ్వలేదని మంత్రి అన్నారు. దీనిపై కాంగ్రెస్ వాళ్లు మాట్లాడకుండా కేసీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!