Harish Rao: రాబోయే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్ సెంచరీ
జహీరాబాద్ లో మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇక్కడ ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులేనని.. మనకి బూతులు కావాలా..? తెలంగాణ భవిష్యత్తు కావాలా ..?అని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ రైతుబంధు ఇస్తే బిచ్చం ఇస్తున్నారని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే అన్నం తినబుద్ది కావడం లేదని హీరో పవన్ కళ్యాణ్ బాధపడ్డారని గుర్తు చేశారు.
తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rohit Sharma: ఓ అభిమానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ
Also Read
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
వికారాబాద్ లో ఓడగొట్టారని కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ ఇక్కడికి వచ్చాడని మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచి కేసీఆర్ కి గిఫ్ట్ ఇద్దామని తెలిపారు. గీతారెడ్డి కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు ఏం పనులు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ అంటే నమ్మకం, విశ్వాసం అని.. కాంగ్రెస్ అంటే నయవంచన, నాటకం అని విమర్శలు చేశారు. డీకే శివకుమార్ తో ఆ శివుడు నిజాలు చెప్పిచ్చినట్టు ఉన్నాడని.. శివకుమార్ 5 గంటల కరెంట్ కామెంట్స్ తో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాడని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్ సెంచరీ అని హరీష్ రావు అన్నారు.
Pawan Kalyan: నెత్తురు మరిగిన హంగ్రీ చీతా.. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఏమున్నాడు
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుబంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుకు 15 వేలు అన్నారు.. కేసీఆర్ ఎకరానికి 16 వేలు ఇస్తా అన్నారని తెలిపారు. మరోవైపు నూనె, నీళ్లు కలుస్తాయా.. బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఎప్పటికి కలవవని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకలో సీఎంని మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారని.. నిన్న 25 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని.. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని మంత్రి అన్నారు. నిన్నటి వరకు బీజేపీలో ఉన్న వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరారని.. మొన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని తెలిపారు. బీజేపీలో ఉన్న నాయకులంతా కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్లు కొన్ని కుట్రలు చేస్తున్నారని.. కొందరికి తాగించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయినప్పుడు గొడవ చేయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
- Tags
- bjp
- BRS
- comments
- congress
- harish rao
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో