Harish Rao: రాబోయే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్ సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జహీరాబాద్ లో మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇక్కడ ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులేనని.. మనకి బూతులు కావాలా..? తెలంగాణ భవిష్యత్తు కావాలా ..?అని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ రైతుబంధు ఇస్తే బిచ్చం ఇస్తున్నారని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే అన్నం తినబుద్ది కావడం లేదని హీరో పవన్ కళ్యాణ్ బాధపడ్డారని గుర్తు చేశారు.
తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rohit Sharma: ఓ అభిమానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
వికారాబాద్ లో ఓడగొట్టారని కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ ఇక్కడికి వచ్చాడని మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచి కేసీఆర్ కి గిఫ్ట్ ఇద్దామని తెలిపారు. గీతారెడ్డి కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు ఏం పనులు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ అంటే నమ్మకం, విశ్వాసం అని.. కాంగ్రెస్ అంటే నయవంచన, నాటకం అని విమర్శలు చేశారు. డీకే శివకుమార్ తో ఆ శివుడు నిజాలు చెప్పిచ్చినట్టు ఉన్నాడని.. శివకుమార్ 5 గంటల కరెంట్ కామెంట్స్ తో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాడని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్ సెంచరీ అని హరీష్ రావు అన్నారు.
Pawan Kalyan: నెత్తురు మరిగిన హంగ్రీ చీతా.. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఏమున్నాడు
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుబంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుకు 15 వేలు అన్నారు.. కేసీఆర్ ఎకరానికి 16 వేలు ఇస్తా అన్నారని తెలిపారు. మరోవైపు నూనె, నీళ్లు కలుస్తాయా.. బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఎప్పటికి కలవవని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకలో సీఎంని మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారని.. నిన్న 25 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని.. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని మంత్రి అన్నారు. నిన్నటి వరకు బీజేపీలో ఉన్న వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరారని.. మొన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని తెలిపారు. బీజేపీలో ఉన్న నాయకులంతా కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్లు కొన్ని కుట్రలు చేస్తున్నారని.. కొందరికి తాగించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయినప్పుడు గొడవ చేయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
- Tags
- bjp
- BRS
- comments
- congress
- harish rao
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..