Harish Rao: రాబోయే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్ సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జహీరాబాద్ లో మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇక్కడ ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులేనని.. మనకి బూతులు కావాలా..? తెలంగాణ భవిష్యత్తు కావాలా ..?అని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ రైతుబంధు ఇస్తే బిచ్చం ఇస్తున్నారని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే అన్నం తినబుద్ది కావడం లేదని హీరో పవన్ కళ్యాణ్ బాధపడ్డారని గుర్తు చేశారు.
తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rohit Sharma: ఓ అభిమానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
వికారాబాద్ లో ఓడగొట్టారని కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ ఇక్కడికి వచ్చాడని మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచి కేసీఆర్ కి గిఫ్ట్ ఇద్దామని తెలిపారు. గీతారెడ్డి కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు ఏం పనులు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ అంటే నమ్మకం, విశ్వాసం అని.. కాంగ్రెస్ అంటే నయవంచన, నాటకం అని విమర్శలు చేశారు. డీకే శివకుమార్ తో ఆ శివుడు నిజాలు చెప్పిచ్చినట్టు ఉన్నాడని.. శివకుమార్ 5 గంటల కరెంట్ కామెంట్స్ తో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాడని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్ సెంచరీ అని హరీష్ రావు అన్నారు.
Pawan Kalyan: నెత్తురు మరిగిన హంగ్రీ చీతా.. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఏమున్నాడు
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుబంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుకు 15 వేలు అన్నారు.. కేసీఆర్ ఎకరానికి 16 వేలు ఇస్తా అన్నారని తెలిపారు. మరోవైపు నూనె, నీళ్లు కలుస్తాయా.. బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఎప్పటికి కలవవని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకలో సీఎంని మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారని.. నిన్న 25 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని.. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని మంత్రి అన్నారు. నిన్నటి వరకు బీజేపీలో ఉన్న వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరారని.. మొన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని తెలిపారు. బీజేపీలో ఉన్న నాయకులంతా కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్లు కొన్ని కుట్రలు చేస్తున్నారని.. కొందరికి తాగించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయినప్పుడు గొడవ చేయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
- Tags
- bjp
- BRS
- comments
- congress
- harish rao
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!