తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు తనయుడు తన్నీరు ఆర్చిష్మాన్ అమెరికాలోని బౌల్డర్లోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. గురువారం జరిగిన స్నాతకోత్సవానికి మంత్రి హాజరయ్యారు. తన కొడుకు సాధించిన విజయానికి ఇంతకంటే గర్వపడలేనని హరీష్ రావు ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఇది అతని పట్టుదల, మార్పు కోసం అభిరుచికి నిదర్శనం. ఆర్చిష్మాన్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారని ఆయన చెప్పారు.
Also Read : Ammaku Prema Kammani Vanta : అమ్మకు ప్రేమతో కమ్మనివంటలో మాధవిలత చెప్పిన సీక్రెట్స్
హరీష్ రావు తన ట్వీట్లో ‘మా అబ్బాయి ఆర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉండగలనా? ఇది అతనిలోని పట్టుదలకు, మార్పు తీసుకురావాలన్న ఆకాంక్షకు నిదర్శనం. తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. అచ్చూ.. ఈ ఘనమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు అభినందనలు’ అంటూ తన తనయుడిని ఉద్దేశించి క్యాప్షన్ రాసుకొచ్చారు మంత్రి హరీష్ రావు.
Also Read : Sunil Kanugolu : కర్ణాటక ఎన్నికల్లో పీకే శిష్యుడు సక్సెస్.. నెక్ట్స్ తెలంగాణే..?