Botsa Satyanarayana: పదికాలాల పాటు చంద్రబాబు చల్లగా ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana: గతంలో ఎన్నికైన నాలుగేండ్ల తర్వాత పార్టీలు బయట అడుగు బయటపెట్టాలంటే భయపడేవారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.జగన్ మన గౌరవం, ఇమేజ్ పెంచారని, ప్రతి లబ్దిదారునికి మేలు జరిగిందని మంత్రి పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో పెద్ద కుట్ర, కుతంత్రం జరుగుతోందని ఆయన అన్నారు. పేదవాడు ఆర్థికంగా ముందుకు వెళ్తుంటే తట్టుకోలేకపోతున్నారని.. పేదోడికి న్యాయం జరగకుండా ఉండేందుకు చర్యలు జరుగుతున్నాయని మంత్రి మండిపడ్డారు. దోపిడి రాజ్యం రావాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు.
Also Read: Rahul Gandhi: సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి సమీక్షించాలి..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
వ్యవస్థలను మేనేజ్ చెయటంలో పెద్ద దిట్ట అని.. నేడు మనల్ని విమర్శిస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. గతంలో దొంగతనం, దోపిడి చేసి దోచుకున్నారని.. వ్యవస్థలలో లొసుగులతో, చట్టాలలో లోపాలతో తప్పుకున్నారని ఆయన ఆరోపించారు. నేడు జగన్ ప్రభుత్వం చేసిన తప్పును, దోపిడినీ పకడ్బందీగా న్యాయస్థానం ముందు పెట్టిందన్నారు. ఒంట్లో, కంట్లో బాలేదు , చర్మ వ్యాధి వచ్చిందని కోర్టులో చెప్పారని.. పదికాలాల పాటు చంద్రబాబు చల్లగా ఉండాలనే తాము కోరుతున్నామన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ వారు ఏం పీకుతారు అన్నారని , అవినీతి అన్యాయం చేసి కబుర్లు మాటాడితే ఎం జరిగిందో చూసారు కదా అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. సామాన్యులు, పేదవారి గురించి, రైతు గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించరని ఆయన అన్నారు. చంద్రబాబు డబ్బులు ఇస్తే ఓటేస్తారనుకోవడం పొరపాటు , ప్రజలు చాలా తెలివైనవారని మంత్రి పేర్కొన్నారు.
Also Read: Kishan Reddy : తెలంగాణ ముందుకు వెళ్లాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..” దొంగోడు జైల్లొంచి వస్తే ఆనందపడాలా..?. కేసు కొట్టేస్తే పోనీ అని ఆనంద పడాలి.. కానీ లేనివి ఉన్నట్లు లేనివి ఉన్నట్లు చెప్పే కుట్ర జరుగుతోంది.సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక న్యాయం గురించి ప్రజలకు తెలియ చెప్పాలి. అంబేడ్కర్ స్పూర్తితో సమ సమాజ స్థాపనకు జరుగుతున్న కృషి తెలియజేయాలి. మంత్రి పదవులు సహా అన్నింటా సామాజిక న్యాయం అందిస్తున్నాం. గతంలో మాదిరి జన్మభూమి కమిటీలు కాకుండా అవినీతి లేకుండా కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నాం.” అని మంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!