Ambati Rambabu: మంత్రి విడదల రజనీ ఆఫీసుపై టీడీపీ శ్రేణుల దాడి దుర్మార్గం
Ambati Rambabu: గుంటూరులో మంత్రి రజని కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆఫీస్ మీద రాళ్లు వేసి ఫ్లెక్సీలు చింపివేసి టీడీపీ శ్రేణులు రౌడీయిజం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ వాళ్లు ఫ్రీ ప్లాన్డ్గా చేసిన చర్య ఇది అంటూ ఆయన ఆరోపించారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై దాడి చేయడం హింసను ప్రేరేపించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కార్యాలయం పై దాడి చేసిన వారిని క్షమించేది లేదన్నారు. దాడి చేసిన వారిని అణచివేస్తామని, చట్టం తన పని తాను చేస్తుందన్నారు. ఒక బీసీ మహిళ పోటీ చేస్తుంటే దమ్ముంటే ప్రజాస్వామ్య విధంగా పోటీ చేసి గెలవాలన్నారు. అంతేగాని బీసీ మహిళపై దాడి చేయడం మంచిది కాదన్నారు. టీడీపీ, జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటుందో గుంటూరు ఘటనతో తెలిసిందన్నారు మంత్రి అంబటి రాంబాబు.
Read Also: Visakha: విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
గతంలో ఖమ్మంలో నాపై కూడా ఓ సామాజిక వర్గం వాళ్లు దాడి చేశారు.. వాళ్లు కూడా మొత్తం టీడీపీ వాళ్లేనని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కాళ్లకున్న చెప్పులు తీసి బూతులు తిట్టి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని.. జనసేన సైనికులను అరాచక శక్తులుగా తయారు చేస్తున్నారని విమర్శించారు. ఇది దురదృష్టకరమైన పరిణామమన్నారు. నారా లోకేష్ రాసేది ఎర్రబుక్కో, ఎర్రి బుక్కో భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. కానీ ఎర్రబుక్కు పేరుతో మంత్రులను, అధికారులను బెదిరించడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. ఈ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని.. కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమన్నారు. కుప్పంలో గెలిచిన ఇన్నాళ్లకు, కుప్పం అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. కుప్పంను మున్సిపాలిటీ చేసుకోలేకపోయినా దీన పరిస్థితి చంద్రబాబుదంటూ ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి కుప్పంలో సొంత ఇల్లు లేదు.. ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు లేదు… ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారంట అంటూ ప్రశ్నించారు. ప్రజలు ,మేధావులు ,చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ చేస్తున్న కుయుక్తులు ప్రజలు గమనించాలన్నారు.
Read Also: MP Mithun Reddy: చంద్రబాబు నాయుడిపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. “చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు. హౌసింగ్లో అవినీతి జరిగిందని, ల్యాండ్ ఎంక్వయిరీ విషయంలో అక్రమాలు జరిగాయని సీబీఐ విచారణ కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలనుకుంటే చేస్తుంది. రావణాసురుడికి పది తలకాయలు ఉన్నట్లు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఓ తలకాయి. గతంలో సీబీఐని రాష్ట్రంలో రావడానికి వీలు లేదని చెప్పిన చంద్రబాబు, అతని పార్ట్నర్ ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారు. చంద్రబాబు సీబీఐ ఎంక్వయిరీ అడగలేక, పవన్ కళ్యాణ్తో ఆ మాటలు అడిగిస్తున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కలియక రాష్ట్రానికి మంచిది కాదు. చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఉన్నాడు. ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తాననే మనస్తత్వం చంద్రబాబుది. పదవి మీద ఎందుకు అంత వ్యామోహమో అర్దం కాదు. గతంలో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిపై దాడి చేశారు. ఖమ్మంలో నాపై దాడి చేశారు.ఇప్పుడు బీసీ మహిళ మంత్రి విడదల రజనీపై దాడి చేస్తున్నారు. విధ్వంసాలు చేయడం ద్వారా అధికారం సాధిద్దామని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ప్రజాస్వామ్యంలో దాడులు ప్రజలు క్షమించరు.” అని మంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!