Facebook Love: ఫేస్బుక్ ప్రేమకథ.. ప్రియుడి కోసం సరిహద్దు దాటి పాక్ వెళ్లిన భారతీయ మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Facebook Love: పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ నేపథ్యం, భారతదేశంలోకి ఆమె అక్రమ ప్రవేశంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక భారతీయ మహిళ ఇప్పుడు తన ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి వెళ్లింది. రాజస్థాన్లోని భివాడి జిల్లాకు చెందిన ఒక వివాహిత భారతీయ మహిళ, తాను ఫేస్బుక్లో స్నేహం చేసి, ప్రేమలో పడిన వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్కు వెళ్లింది.
అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ.. తన ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లా ఖాన్ కలవడానికి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఫ్రావిన్స్లోని దీర్ సిటీకి జులై 21న వెళ్లిందని సమాచారం.ఉత్తరప్రదేశ్కు చెందిన అంజు.. దీర్కు చెందిన 29 ఏళ్ల నస్రుల్లా ఖాన్ ఫేస్బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. నస్రుల్లా గతంలో పాఠశాల ఉపాధ్యాయుడు, కానీ ప్రస్తుతం మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. వారిద్దరూ సోషల్ మీడియాలో కలుసుకున్నారని, అంజు అతన్ని కలవడానికి సరిహద్దు వెళ్లింది.
Also Read
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
Also Read: Instagram Love Tragedy: ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. ఆపై న్యూడ్ వీడియో కాల్స్తో బ్లాక్మెయిల్
జైపూర్కు వెళ్లే నెపంతో గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయారని, అయితే ఆమె పాకిస్థాన్లో ఉన్నట్లు కుటుంబసభ్యులకు తెలిసిందని మహిళ భర్త అరవింద్ పోలీసులకు తెలిపారు. తన స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అరవింద్ పోలీసులకు తెలిపాడు. అంజు అనే మహిళ కొన్ని రోజులకు జైపూర్ వెళ్తున్నట్లు భర్త అరవింద్కు చెప్పింది. అయితే ఆదివారం నాడు అంజు సరిహద్దు దాటి వెళ్లిందని అరవింద్ తెలుసుకున్నాడు. అంజు తమతో వాట్సాప్ ద్వారా టచ్లో ఉండేదని అరవింద్ తెలిపాడు. ఆమె ఆదివారం సాయంత్రం 4 గంటలకు అతనికి ఫోన్ చేసి, తాను లాహోర్లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది.
పాకిస్తాన్లో అంజు ప్రేమికుల పుకారు గురించి అడిగినప్పుడు, అరవింద్ తనకు దాని గురించి తెలుసునని, అతని భార్య తన వద్దకు తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.అరవింద్ భివాడిలో పనిచేస్తున్నాడు. అంజు కూడా ఒక ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తోంంది. ఇద్దరు పిల్లలు ఉన్న ఈ జంట, అంజు అరవింద్తో కలిసి క్రైస్తవ మతంలోకి మారడంతో వివాహం చేసుకున్నారు. అరవింద్ తన భార్య. పిల్లలతో, అంజు సోదరుడితో కలిసి భివాడిలోని అద్దె ఫ్లాట్లో ఉన్నాడు.
Also Read: Phone Charging: రోజుకు ఎన్నిసార్లు ఫోన్ కు చార్జింగ్ పెట్టాలో తెలుసా?
గురువారం నాడు జైపూర్కు వెళ్లే నెపంతో అంజు భివాడిలోని తన ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత తన 29 ఏళ్ల ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్ వెళ్లింది.వైద్య రంగంలో పనిచేస్తున్న నస్రుల్లా, అంజు కొన్ని నెలల క్రితం ఫేస్బుక్లో స్నేహితులయ్యారని సమాచారం. ఆమె మొదట పోలీసు కస్టడీలో ఉంది, అయితే ఆమె ప్రయాణ పత్రాలను ధృవీకరించిన తర్వాత విడుదల చేశారు. “ప్రయాణ పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని గుర్తించిన తర్వాత ఆమెను వెళ్లేందుకు అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దేశానికి చెడ్డపేరు తెచ్చేలా వారికి భద్రత కల్పించారు” అని తెలిసింది.
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!