Mamata Banerjee: ప్రియాంక గాంధీకి మద్దతుగా వయనాడ్లో బెంగాల్ సీఎం ప్రచారం..!
- కాంగ్రెస్- టీఎంసీ మధ్య కుదిరిన సయోధ్య..
- మమతా బెనర్జీతో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం..
- ప్రియాంక తరపున వయనాడ్ లో ప్రచారం చేయనున్న మమతా బెనర్జీ..?
Mamata Banerjee: కాంగ్రెస్, టీఎంసీ మధ్య మళ్లీ సయోధ్య కుదిరినట్లుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేసేందుకు స్వయంగా రంగంలోకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బెంగాల్ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రితో కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం భేటీ అయిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
Read Also: Mancherial: మంచిర్యాలలో విచిత్ర ఘటన.. చనిపోయిన నాలుగేళ్ల తర్వాత కాల్ లెటర్..
Also Read
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
- Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
కాగా, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి, మమతా బెనర్జీల మధ్య గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతుంది. రాష్ట్రంలో టీఎంసీ- కాంగ్రెస్ పోత్తు చర్చలు విఫలం కావడానికి అధీర్ రంజన్ చౌదరి కారణమని టీఎంసీ అధినేత్రి పేర్కొన్నారు. అయితే, ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ భారతీయ జనతా పార్టీపై పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 42 లోక్ సభ స్థానాలకు ఏకంగా 29 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అభిషేక్ బెనర్జీ.. కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అనేక అంశాలపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు కొనసాగించారు.
Read Also: Train Stuck On Bridge: బ్రిడ్జి మీద ఆగిన రైలు.. గాల్లో వేలాడుతూ రిపేర్ చేసిన లోకోపైలట్లు..
ఇందులో భాగంగానే.. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తొలుత సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ ఛద్దా, అనంతరం ముంబైలో ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఇక టీఎంసీ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, సాగరికా ఘోసే, సాకేత్ గోఖలేలు ఎగ్జిట్ పోల్స్ అవకతవకలపై విచారణకు డిమాండ్ చేస్తూ ఎన్సీపీ నేతలతో కలిసి ధర్నా కూడా చేశారు. అయితే, ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ మాత్రం దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రిని ప్రసన్నం చేసుకునేందుకు పీ చిదంబరం నేరుగా చర్చలకు వెళ్లారు. మరోవైపు, అధీర్ రంజన్ చౌదరి కూడా మమతా బెనర్జీపై విమర్శలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. తనకు మమతతో రాజకీయంగా తప్ప వ్యక్తిగత అభిప్రాబేధాలు ఏమీ లేవంటూ అధీర్ రంజన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం మమత కూడా ప్రియాంక గాంధీ తరపున వయనాడ్లో ప్రచారం చేయబోతున్నట్లు జాతీయ మీడియాలో న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!