టీఏస్ పీఏస్సీ పేపర్ లీక్ లో రెండు వారాలా తర్వాత ఛైర్మన్ విచారణ చేసారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిట్ విచారణ వద్దు సీబీఐ విచారణ కావాలని అఖిలపక్షం మొత్తం కోరిందన్నారు. మరోవైపు టెన్త్ పేపర్ వరుసగా రెండు రోజులు లీకైయిందని, ఎగ్జామినేషన్ సిస్టంను పనిచేయించే వ్యవస్థ ప్రభుత్వం దగ్గర లేదని ఆయన మండిపడ్డారు. ప్రశాంత్, బండి సంజయ్ తో వందల సార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం ద్వారా బీఆర్ఎస్, లీక్ ల మీద పోరాడుతున్నట్లుగా బీజేపీ ఎక్స్ పోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న టీఏస్ పీఏస్సీ సభ్యులు, ఛైర్మన్ ను మార్చి కొత్త వారిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన గాడితప్పిందని ఆయన మండిపడ్డారు.
Also Read : Ideas for India: మంత్రి కేటీఆర్కు మరో గౌరవం.. బ్రిటన్ సదస్సుకు ఆహ్వానం
నిన్న మల్లు రవి మాట్లాడుతూ.. నిరుద్యోగులు, విద్యార్థులు అంటే ప్రభుత్వంకు ఎందుకు ఇంత అలసత్వమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన లీకేజీ ల పాలన అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల కు అయ్యే ఖర్చు కేసీఆర్ కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. రాజ్ దీప్ సర్దేశాయి వాఖ్యలు తప్పయితే ఇంత వరకు ఎందుకు ఖండించలేదని ఆయన అన్నారు. మిగతా టెన్త్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోతే.. పిల్లలు, తల్లిదండ్రుల పక్షాన జైల్ భరో కార్యక్రమం తీసుకుంటామని మల్లు రవి స్పష్టం చేశారు.
Also Read : Delhi liquor policy case: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు