Delhi liquor policy case: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడు ఆప్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది ఏప్రిల్ 12న అతని బెయిల్ పిటిషన్ను విచారించనుంది. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read:Bengaluru: మోడీ ప్రారంభించిన మెట్రో స్టేషన్.. నల్లూర్హళ్లిని ముంచెత్తిన వరద
సిసోడియా తరఫున న్యాయవాది వివేక్ జైన్ వాదనలు వినిపిస్తూ, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) ప్రకారం అతనిపై (సిసోడియా) ఎలాంటి నేరం చేయబడలేదన్నారు. సిసోడియా తరపు న్యాయవాది సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత, రోస్ అవెన్యూ కోర్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె. నాగ్పాల్ సిసోడియా బెయిల్ను ఏప్రిల్ 12న విచారిస్తామని తెలిపారు. ED తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPP) జోహెబ్ హుస్సేన్ కోర్టులో విధించారు. హవాలాకు సంబంధించిన కొన్ని తాజా సాక్ష్యాలను సేకరిస్తున్నందున తమకు కొంత సమయం కావాలని కోరారు. ఇంకా కొన్ని కీలకమైన సాక్ష్యాలు బయటపడుతున్నాయి అని హొస్సేన్ అన్నారు.
Also Read:Ashwagandha: మగవారు అశ్వగంధ లేహ్యం తింటే ఏం జరుగుతుంది?
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయన్న సీబీఐ.. ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాను తీహార్ జైలులో ప్రశ్నించిన తరువాత మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది. ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 10న ఢిల్లీ కోర్టు సిసోడియాను మార్చి 17 వరకు ఈడీ కస్టడీకి పంపింది.
Also Read:Srinivas Gude: టెన్త్ పేపర్ లీకేజీ కుట్రలో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
మార్చి 22న ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆప్ నాయకుడిని ఈడీ రూస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచింది. విచారణ తర్వాత సిసోడియా కస్టడీ ఏప్రిల్ 5 వరకు పొడిగించబడింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఫిబ్రవరి 26 న సిసోడియాను అరెస్టు చేసింది. 2021-22 కోసం ఇప్పుడు రద్దు చేయబడిన మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందని గుర్తించారు. పలు దఫాలుగా విచారించిన తర్వాత సీబీఐ అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!