Delhi liquor policy case: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడు ఆప్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది ఏప్రిల్ 12న అతని బెయిల్ పిటిషన్ను విచారించనుంది. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read:Bengaluru: మోడీ ప్రారంభించిన మెట్రో స్టేషన్.. నల్లూర్హళ్లిని ముంచెత్తిన వరద
సిసోడియా తరఫున న్యాయవాది వివేక్ జైన్ వాదనలు వినిపిస్తూ, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) ప్రకారం అతనిపై (సిసోడియా) ఎలాంటి నేరం చేయబడలేదన్నారు. సిసోడియా తరపు న్యాయవాది సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత, రోస్ అవెన్యూ కోర్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె. నాగ్పాల్ సిసోడియా బెయిల్ను ఏప్రిల్ 12న విచారిస్తామని తెలిపారు. ED తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPP) జోహెబ్ హుస్సేన్ కోర్టులో విధించారు. హవాలాకు సంబంధించిన కొన్ని తాజా సాక్ష్యాలను సేకరిస్తున్నందున తమకు కొంత సమయం కావాలని కోరారు. ఇంకా కొన్ని కీలకమైన సాక్ష్యాలు బయటపడుతున్నాయి అని హొస్సేన్ అన్నారు.
Also Read:Ashwagandha: మగవారు అశ్వగంధ లేహ్యం తింటే ఏం జరుగుతుంది?
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయన్న సీబీఐ.. ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాను తీహార్ జైలులో ప్రశ్నించిన తరువాత మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది. ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 10న ఢిల్లీ కోర్టు సిసోడియాను మార్చి 17 వరకు ఈడీ కస్టడీకి పంపింది.
Also Read:Srinivas Gude: టెన్త్ పేపర్ లీకేజీ కుట్రలో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
మార్చి 22న ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆప్ నాయకుడిని ఈడీ రూస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచింది. విచారణ తర్వాత సిసోడియా కస్టడీ ఏప్రిల్ 5 వరకు పొడిగించబడింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఫిబ్రవరి 26 న సిసోడియాను అరెస్టు చేసింది. 2021-22 కోసం ఇప్పుడు రద్దు చేయబడిన మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందని గుర్తించారు. పలు దఫాలుగా విచారించిన తర్వాత సీబీఐ అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!